AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భారత అభివృద్ధికి బాటలు.. ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై ఎన్డీయే నేతల ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. తయారీ, ఆవిష్కరణకు భారత్‌ను గమ్యస్థానంగా చూడాలని అమెరికన్ టెక్‌ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు. భారత్‌తో కలిసి సహ-అభివృద్ధి, సహ-డిజైన్‌, సహ ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రంలో..

PM Modi: భారత అభివృద్ధికి బాటలు.. ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై ఎన్డీయే నేతల ప్రశంసలు
Pm Modi
Subhash Goud
|

Updated on: Sep 24, 2024 | 9:31 PM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. తయారీ, ఆవిష్కరణకు భారత్‌ను గమ్యస్థానంగా చూడాలని అమెరికన్ టెక్‌ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు. భారత్‌తో కలిసి సహ-అభివృద్ధి, సహ-డిజైన్‌, సహ ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరిన పార్టీలకు చెందిన పలువురు పెద్ద నేతలు ప్రశంసించారు. దీంతో పాటు ప్రధాని పర్యటన విజయవంతమైందని నేతలు ఆయనకు స్వాగతం పలికారు. భారత్, అమెరికాల మధ్య పెట్టుబడులు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలను స్వాగతించారు.

వీరిలో జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి పెద్ద నేతలు కూడా ఉన్నారు. దీనివల్ల అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని, అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోవచ్చని నేతలు తెలిపారు.

ప్రధాని నాయకత్వాన్ని బలపరుస్తుంది: బీహార్‌ సీఎం

ఈ సందర్భంగా బీహార్‌ సీఎం నితీష్ మాట్లాడుతూ.. పర్యటన చాలా విస్తృతమైన ప్రభావాలను చూపుతుందని అన్నారు. ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనలు, వాటి నుంచి ఉత్పన్నమవుతున్న కొత్త అవకాశాలతో బీహార్ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ముఖ్యమంత్రి ట్విట్‌ చేశారు. ప్రపంచ నాయకులు, ప్రవాస భారతీయులు ప్రధానమంత్రికి ఇచ్చిన సాదర స్వాగతం ఆయన నాయకత్వాన్ని బలపరుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటనతో సుదూర, సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుందని, పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న మోడీకి అభినందనలు తెలిపారు.

ప్రధాని దేశాలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు: చంద్రబాబు

ప్రధాని మోడీ అమెరిక పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అదే సమయంలో ఇలాంటి రాజకీయ నాయకుడి నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. సమాజంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేశారు. దేశాలలో నిస్సందేహంగా ఒక ప్రధాన ప్రపంచ నాయకుడిగా ఉద్భవించారు. సంఘాలు, దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన చేసిన ప్రసంగం, ప్రపంచ నాయకుడు భారతదేశంతో ఎంతగా నిమగ్నమై ఉన్నారో ఇట్టే తెలిసిపోతుందన్నారు.

మోడీ గ్లోబల్ పొలిటీషియన్: సీఎం షిండే

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఆయన గ్లోబల్ పొలిటీషియన్ ఎందుకు, అద్భుతమైన ట్రెండ్ సెట్టర్ అని మరోసారి తేలిందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఒక చిన్న ప్రయాణంలో అతను అనేక రంగాలను కవర్ చేయగలిగారని వ్యాఖ్యానించారు. ఇది భారతదేశం పురోగతి ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందన్నారు. భారతీయులుగా, మన ప్రధానికి అమెరికా అధ్యక్షుడు బిడెన్ నుండి ఆయన వ్యక్తిగత నివాసంలో ప్రత్యేక స్వాగతం లభించడం చాలా గర్వంగా ఉందన్నారు.

మోడీ పర్యటన అద్భుతం: హెచ్‌డి కుమారస్వామి

అదే సమయంలో జెడిఎస్ నాయకుడు, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ..యునైటెడ్ స్టేట్స్‌లో మరో విజయవంతమైన పర్యటన తర్వాత నేను ప్రధానికి స్వాగతం పలుకుతున్నాను అని అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఆయన చేసిన పర్యటన అద్భుతమన్నారు మూడు రోజుల పాటు, వారు అణుశక్తి, గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, సెమీకండక్టర్, AI, బయోటెక్నాలజీ, క్వాంటం టెక్నాలజీ, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్, మన సాంస్కృతిక వారసత్వం, అనేక ఇతర అంశాలపై చర్చించారని వ్యాఖ్యానించారు.

మూడు రోజుల పర్యటన విజయవంతం :

మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సెప్టెంబర్ 21న అమెరికా చేరుకున్నారు. అక్కడ, మొదట అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలిశారు. దీని తర్వాత క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఫిలడెల్ఫియాలో జరిగిన ఎన్నారైల కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం, UNGAలో కూడా పీఎం తన అభిప్రాయాలను సమర్పించారు. మోదీ తన పర్యటనలో పలు ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మంగళవారం అమెరికా నుంచి భారత్‌కు వెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి