Modi Cabinet: రైల్వే ఉద్యోగులకు, రైతులకు ముందే వచ్చిన దీపావళీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్

పండుగ సీజన్‌లో రైతులకు, భారతీయ రైల్వే ఉద్యోగులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభవార్త ప్రకటించారు. మోదీ నేతృత్వంలోని NDA సర్కార్ పెద్ద బహుమతిని అందించింది.

Modi Cabinet: రైల్వే ఉద్యోగులకు, రైతులకు ముందే వచ్చిన దీపావళీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్
Pm Modi
Follow us

|

Updated on: Oct 03, 2024 | 9:38 PM

పండుగ సీజన్‌లో భారతీయ రైల్వే ఉద్యోగులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభవార్త ప్రకటించారు. మోదీ నేతృత్వంలోని NDA సర్కార్ పెద్ద బహుమతిని అందించింది. గురువారం (అక్టోబర్ 3) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ ఆమోదించింది. సాయంత్రం జరిగిన కేబినెట్ బ్రీఫింగ్‌లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు.

రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్

కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా, రైల్వే ఉద్యోగులకు బోనస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. ఇందుకు మొత్తం 2,029 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది మొత్తం 78 రోజుల బోనస్ అవుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 11,72,240 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం రైల్వేలో 58,642 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

రైతులకు శుభవార్త

రైల్వే ఉద్యోగులతో పాటు రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయం పెంపు, ఆహార భద్రత దృష్ట్యా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి రాష్ట్ర కృషి వికాస్ యోజన, కృషి ఉన్నతి యోజనలకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.1,01,321 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) 2007-08 నుండి వ్యవసాయ రంగంలో 4% వార్షిక వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, సహకార శాఖ (DAC) క్రింద ప్రారంభించింది.

ఎడిబుల్ ఆయిల్స్‌పై జాతీయ మిషన్‌ ఏర్పాటు

రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఈ రెండు పథకాలు కూడా తక్కువ ఆదాయం, మధ్య ఆదాయ ప్రజలకు ఆహార భద్రత ప్రయోజనాలను అందిస్తాయి. దీనితో పాటు, ఎడిబుల్ ఆయిల్స్‌పై జాతీయ మిషన్‌కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,103 కోట్లు వెచ్చించనుంది. అలాగే, రూ. 63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో ఫేజ్-2కి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు, మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీతో సహా మరో 5 భాషలకు ప్రభుత్వం శాస్త్రీయ భాష హోదాను ఇచ్చింది. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు ఇప్పటికే ఈ విభాగంలో ఉన్నాయి.

ఉపాధి కల్పనపై మోదీ సర్కార్ దృష్టి

ఉపాధి కల్పనపై కూడా మోదీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్‌గా చేర్చడం వల్ల ముఖ్యంగా అకడమిక్, రీసెర్చ్ రంగాలలో గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అదనంగా, ఈ భాషలలోని పురాతన గ్రంథాల సంరక్షణ, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ సేకరణ, అనువాదం, ప్రచురణ, డిజిటల్ మీడియాలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇందులో చేర్చిన ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర (మరాఠీ), బీహార్ (పాలీ, ప్రాకృత), పశ్చిమ బెంగాల్ (బెంగాలీ) అస్సాం (అస్సామీ) ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు