AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indigo Flight: మళ్ళీ విమానానికి బాంబు బెదిరింపు.. రాయ్‌పూర్‌లో ఎమర్జెనీ ల్యాండింగ్.. కొనసాగుతున్న దర్యాప్తు..

మన దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఈ విమానం బాంబు బెదిరింపుతో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Indigo Flight: మళ్ళీ విమానానికి బాంబు బెదిరింపు.. రాయ్‌పూర్‌లో ఎమర్జెనీ ల్యాండింగ్.. కొనసాగుతున్న దర్యాప్తు..
Indigo Flight Bomb Threat
Surya Kala
|

Updated on: Nov 14, 2024 | 3:10 PM

Share

భారత్‌లో విమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మరో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ఈ చర్య తీసుకున్నారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందిన వెంటనే ముందుజాగ్రత్తగా రాయ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. తక్షణమే భద్రతా చర్యలు చేపట్టారు.

బాంబు గురించి సమాచారం అందిన వెంటనే విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి విమానాన్ని తరలించారు. అనంతరం బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించి విచారణ చేస్తున్నారు.

కొనసాగుతోన్న కేసు దర్యాప్తు

ఇవి కూడా చదవండి

విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కొద్దిసేపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానంలో దర్యాప్తు కొనసాగుతోంది. అంతేకాదు అసలు ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నారు. బాంబు బెదిరింపు రావడంతో 187 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందిని వెంటనే విమానాశ్రయంలో దింపినట్లు రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ సింగ్ తెలిపారు. తప్పనిసరి భద్రతా తనిఖీలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించి ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తీసుకుని వచ్చారు. అనంతరం విమానాన్ని పరిశీలిస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్న అంతర్జాతీయ ఏజెన్సీలు

వరస బాంబు బెదిరింపు ఘటనలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పందించారు. వరసగా వస్తున్న ఈ నకిలీ బెదిరింపులను ఆపడానికి అంతర్జాతీయ ఏజెన్సీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో బృందాలు ఈ విషయంపై దృష్టి పెట్టాయని చెప్పారు. ఈ బృందాలు నిరంతరం పరిశీలిస్తున్నాయన్నారు. అంతేకాదు దీనితో పాటు విమానయాన చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!