పరారైన కరోనా సోకిన హంతకుడు
కరోనా సోకిన ఓ హంతకుడు పరారయ్యాడు. అతడిని కరోనా కేర్ సెంటర్కు తరలించగా.. అందరి కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
కరోనా సోకిన ఓ హంతకుడు పరారయ్యాడు. అతడిని కరోనా కేర్ సెంటర్కు తరలించగా.. అందరి కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో సోమవారం జరిగింది.
కల్యాణ్ మోహన్ అనే వ్యక్తి తనతో సహ జీవనం చేస్తున్న మహిళను గత నెల 30న హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకన్న ఖడక్పాడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతడికి కరోనా సోకడంతో.. జూన్ 16న ఓ కోవిడ్ కేర్ సెంటర్కి తరలించారు. అతడికి కాపలాగా ముగ్గురు పోలీసులను అక్కడ పెట్టారు. అయితే వారి కళ్లు కప్పి సోమవారం అతడు తప్పించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అతడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వారు వెల్లడించారు.
Read This Story Also: భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ.. వెలుగులోకి మరో వీడియో