ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు మృతి చెందగా, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది. లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుంటూరు ఎయిమ్స్లో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేశారు. గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.