AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramnami Tribe: ఆదివాసీల వింత ఆచారం.. శరీరంపై ‘శ్రీరామ’ పచ్చబొట్టు.. చరిత్ర ఏంటంటే

ఈ తెగవారిని శ్రీరాముని ఆలయంలోకి అనుమతించకపోవడంతో తెగకు చెందిన ఓ పెద్ద.. తన వంటిపై శ్రీరాముడి పేరును నుదిటిపై పచ్చబొట్టు వేసుకుని తమ నుంచి రాముడిని వేరు చేయలేరని చెప్పారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు. పురాణాలలో మాత్రం గిరిజన తెగకు చెందిన...

Ramnami Tribe: ఆదివాసీల వింత ఆచారం.. శరీరంపై 'శ్రీరామ' పచ్చబొట్టు.. చరిత్ర ఏంటంటే
Ramnami Tribe
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 21, 2024 | 5:05 PM

Share

భారతదేశం అనేక గిరిజన తెగలకు నెలవు. ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన గిరిజన తెగ అయిన రామ-నామిలు. వీరు మహానది నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నారు. రామ-నామి తెగ ప్రత్యేకతతో పాటు ఓ విశిష్టత ఉంది. ఈ తెగలోని ప్రతి ఒక్కరు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

ఈ తెగవారిని శ్రీరాముని ఆలయంలోకి అనుమతించకపోవడంతో తెగకు చెందిన ఓ పెద్ద.. తన వంటిపై శ్రీరాముడి పేరును నుదిటిపై పచ్చబొట్టు వేసుకుని తమ నుంచి రాముడిని వేరు చేయలేరని చెప్పారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు. పురాణాలలో మాత్రం గిరిజన తెగకు చెందిన పరశురామ్ భరద్వాజ్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అతను 19వ శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలో రామాయణ కథల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. చిన్నతనంలోనే తండ్రి దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించి 12 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. పరశురాం రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడానికి, వాటి అర్థాలను అర్థం చేసుకోవడానికి చదవడం, రాయడం నేర్చుకున్నాడు.

పరశురాముడు కుష్టు వ్యాధి బారిన పడ్డాడు. ఈ సమయంలో, అతను ఒక సాధువు (ఋషి)ని కలుసుకున్నాడు. రామాయణం పఠించమని సూచించాడు. మరుసటి రోజు నుంచి అతని ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. అంతేకాదు అతని శరీరంపై ‘రామ్-రామ్’ అనే పదం పచ్చబొట్టు రూపంలో కనిపించిందని పరశురామ్ తెలుసుకున్నాడు. ఇది ఒక అద్భుతంగా భావించబడింది. అప్పటి నుంచి అతడిని అనుసరిస్తూ ఈ తెగ కు చెందిన మిగతా ప్రజలంతా శరీరంపై శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకోవడం ప్రారంభించారు. సాక్షాత్తు రాముడు తమలో అవహించాడు అంటూ ఒళ్లంతా రామ నామాన్ని పొడిపించుకుంటున్నారు.

కనురెప్పలను సైతం రామనామంతో నింపేస్తారు. అంతేకాకుండా ఈ రామనామి తెగ ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తారు. కేవలం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడమే కాదు. వారి జీవన విధానంలోని ప్రతీ పనిని, ప్రతీ శుభకార్యాన్ని రామ నామంతోనే ముడి పెడతారు. ఇప్పుడు ఈ తెగ ప్రజలు కూడా ఆలయానికి వెళతారు.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాని రామ్ పేరు రాయించుకుని సంప్రదాయం ఈ రోజు వరకు మారలేదు. “రామ్” అని ముద్రించిన శాలువాలు, నెమలి ఈకలతో చేసిన తలపాగా ధరిస్తారు. ఈ శాఖకు చెందినవారు మద్యపానం, ధూమపానం చేయరు. ప్రతిరోజూ రామ్ నామాన్ని జపిస్తారు. అయితే కాలంలో వస్తున్నా మార్పుల్లో భాగంగా నేటి తరం వారు క్రమ క్రమంగా రామ్ నామాన్ని పచ్చబొట్టుగా వేయించుకునేవారి సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..