AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: తెల్లవారుజామున ఒక్కసారిగా కంపించిన భూమి.. భయంతో వణికిపోయిన జనాలు!

Assam Earthquake: అస్సాం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. మోరిగావ్‌లో 5.1, గోమతిలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు లేవు, అయితే కొన్ని పురాతన భవనాలకు పగుళ్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

Earthquake: తెల్లవారుజామున ఒక్కసారిగా కంపించిన భూమి.. భయంతో వణికిపోయిన జనాలు!
Earthquake In Assam
Anand T
|

Updated on: Jan 05, 2026 | 7:02 AM

Share

అస్సాం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. మోరిగావ్, త్రిపురలోని గోమతిలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో భయపడిపోయిన జనాలు ఇళ్లలోంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మోరిగావ్‌లో రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనల తీవ్రత 5.1గా నమోదైనట్టు అధికారులు గుర్తించగా, గోమతిలో 3.9గా నిర్ధారించారు. మోరిగావ్‌కు 50కి.మీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్టు అధికారులు స్పష్టం చేశారు.

అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కాని ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడ లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లోని పురాతన భవనాలకు మాత్రం చిన్నపాటి పగుళ్లు గుర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.