Owaisi on Navratri: దక్షిణ ఢిల్లీలో నేటి నుండి మాంసం దుకాణాలు బంద్.. ఘాటుగా స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

దేశం మొత్తం నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. నవరాత్రుల సందర్భంగా రాజధాని ఢిల్లీలో రాజకీయ దుమారం చెలరేగింది.

Owaisi on Navratri: దక్షిణ ఢిల్లీలో నేటి నుండి మాంసం దుకాణాలు బంద్.. ఘాటుగా స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Asad Modi
Follow us

|

Updated on: Apr 05, 2022 | 8:00 AM

MP Asaduddin Owaisi: దేశం మొత్తం నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. నవరాత్రుల సందర్భంగా రాజధాని ఢిల్లీ(Delhi)లో రాజకీయ దుమారం చెలరేగింది. నవరాత్రి(Navratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆలయాలకు సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయించే దుకాణాల(Meat Shops)ను మూసివేయాలని దక్షిణ ఢిల్లీ మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశించారు. అదే సమయంలో, AIMIM అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బదులిస్తూ, మాంసం కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారం మాత్రమే అని అన్నారు. మాంసం విక్రయాలపై ఆంక్షలు సరికాదన్నారు.

ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ ఎస్‌డిఎంసి మేయర్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. తన లేఖలో, నవరాత్రి ఏప్రిల్ 11 వరకు ఉంది, ఈ సమయంలో భక్తులు దుర్గా దేవిని పూజించి, ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తమ కుటుంబ సభ్యులకు దీవెనలు పొందుతారు. ఈ రోజుల్లో భక్తులు శాఖాహారం మాత్రమే తింటారు. ఈ సమయంలో మాంసాహారం, మద్యం తీసుకోవడం మానేస్తారు. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ, బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మడం వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. వారి మతపరమైన మనోభావాలు, వారి విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే నిషేధం విధించినట్లు మేయర్ ముఖేష్ సూర్యన్ తెలిపారు.

దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ రాసిన ఈ లేఖపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందిస్తూ.. ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్తలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలని కోరుకుంటున్నారు. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? మాంసం అశుద్ధం కాదు. కేవలం వెల్లుల్లి లేదా ఉల్లి వంటి ఆహారం. ప్రజలు మాంసం కొనకూడదనుకుంటే 99% మంది కాదు 100% మంది మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయకూడదా.” అని ప్రశ్నించారు. ఇదిలావుంటే, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.ఈ ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.

Read Also…  Newly Married: కాళ్ల పారాణి ఆరక ముందే.. వాళ్ల పాలిట యమ పాశంగా మారిన పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక