AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2022 admit card: మరికొన్ని గంటల్లో ముగియనున్న JEE Main 2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..ఈ మార్పులు గమనించారా?

జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే వెంటనే..

JEE Main 2022 admit card: మరికొన్ని గంటల్లో ముగియనున్న JEE Main 2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..ఈ మార్పులు గమనించారా?
Jee Main 2022
Srilakshmi C
|

Updated on: Jun 09, 2022 | 4:37 PM

Share

JEE Main 2022 online registration last date: జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ మరికొన్ని గంటల్లో ముగియనుంది. వాస్తవానికి..ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 31 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఐతే విద్యార్ధుల అభ్యర్ధన మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5 వరకు ఎన్టీఏ పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నేటి అర్థరాత్రి 11 గంటల 50 నిముషాలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ ఈ సందర్భంగా సూచించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక ఈ పరీక్షకు సంబంధించిన తేదీల విషయంలో దేశ వ్యాప్తంగా పలు చర్చలు కూడా జరిగాయి. ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ కొత్త తేదీలు వెలువడినప్పటికీ పలు రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా తేదీలు అడ్డుగా ఉండటంతో ఇంటర్‌, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యుళ్లను కూడా మార్చి కొత్త టైం టేబుళ్లను విడుదల చేశాయి. జేఈఈ మెయిన్ – 2022 ఏప్రిల్‌ సెషన్‌కు సంబంధించిన కొత్త తేదీలు (JEE Main 2022 revised exam dates).. జూన్ 20 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ – 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఎటువంటి వయోపరిమితి లేదు. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈ నెలలో (ఏప్రిల్‌) విడుదలకానున్నాయి.

జేఈఈ మెయిన్ 2022 అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఐతే దరఖాస్తును పూరించే సమయంలో తప్పనిసరిగా ప్రశ్నపత్రం భాషను కూడా ఎంచుకోవల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కో్కతప్పదు. ఇక ఈ ఏడాది నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

Also Read:

TS Kendriya Vidyalayas: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో 767 టీచర్‌ ఉద్యోగాలు.. త్వరలోనే..