AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoists: ఇన్ఫార్మర్‌ నెపంతో మరో గిరిజనుడి హత్య.. దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల మరో దుశ్చర్య

పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కట్టె కళ్యాణ్ పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. వివరాల ప్రకారం..

Maoists: ఇన్ఫార్మర్‌ నెపంతో మరో గిరిజనుడి హత్య.. దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల మరో దుశ్చర్య
Maoists Kill
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2022 | 8:00 PM

Share

దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కట్టె కళ్యాణ్ పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. వివరాల ప్రకారం.. సాయుధలైన మావోయిస్టులు కట్టె కళ్యాణ్‌ను ఇంటికి వెళ్లి, అతనిని బయటకు తీసుకు వెళ్లారు. ఊరికి కొంతదూరంలో ప్రజా కోర్టు ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. అతని చేతులు కట్టేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ పేరుతో మృతదేహం వద్ద ఒక పోస్టర్‌ను విడిచిపెట్టి వెళ్లారు.కట్టె కళ్యాణ్‌ గత కొన్నాళ్లుగా పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడని అందులో పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఆంధ్రా, ఒడిశా బోర్డర్​లోని(AoB) పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జనతన సర్కారు నుంచి అక్కడి ప్రజలు ప్రజా జీవితంలోకి వస్తున్నారు. మల్కన్‌గిరి జిల్లా స్వాభిమాన్ అంచల్‌లో సోమవారం ఒడిశా పోలీసుల ఎదుట 500 మందికి పైగా మావోయిస్టు మద్దతుదారులు లొంగిపోయారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఎస్.కె. బన్సాల్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మారిన్ని జాతీయ వార్తల కోసం..