IAC VIKRANT: భారత నౌకాదళంలోకి IAC విక్రాంత్.. స్వదేశంలో తయారుచేసిన తొలి వాహక నౌక ప్రత్యేకతలివే..
తొలిసారి దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(IAC VIKRANT) భారత నౌకదళంలోకి చేరనుంది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈవాహకనౌకను..
Updated on: Aug 23, 2022 | 7:46 PM

తొలిసారి దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(IAC VIKRANT) భారత నౌకదళంలోకి చేరనుంది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈవాహకనౌకను అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు.

కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్ (CSL)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విక్రాంత్ ను నావికాదళంలోకి ప్రవేశపెడతారు. ఈకార్యక్రమంలో ఐఎన్ ఎస్ విక్రాంత్ నౌక తయారీలో భాగస్వాములైన రిటైర్డు సిబ్బందితో పాటు, నౌక నిర్మాణ, రక్షణ శాఖ అధికారులు సుమారు 2వేల మంది పాల్గొంటారు.

రూ.20వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈనౌకను ఈఏడాది జులై 28వ తేదీన భారత నౌకదళానికి అప్పగించారు. IAC విక్రాంత్ ఇండక్షన్ కోసం భారీ ఏర్పాటు జరుగుతున్నాయి.

IAC విక్రాంత్ విమానవాహక నౌక బరువు దాదాపు 45వేల టన్నులు, ఐఏసీ విక్రాంత్ తయారీలో 75శాతం మేడ్ ఇన్ ఇండియా పరికరాలనే ఉపయోగించారు. అమెరికా నుంచి జీఈ ఎల్ఎం2500 గ్యాస్ టర్బైన్లు తీసుకొచ్చి అమర్చారు. రష్యా, ఇజ్రాయెల్ నుంచి మరికొన్ని పరికరాలను తీసుకొచ్చి జోడించారు.

2009లో IAC విక్రాంత్ నిర్మాణం ప్రారంభమైంది. దీని పొడవు 262 మీటర్లు కాగా.. వెడల్పు 62 మీటర్లు..ఎత్తు 59 మీటర్లు.



