AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam: తీహార్‌ జైలుకు మనీష్‌ సిసోడియా తరలింపు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియాకు ఈనెల 20వ తేదీ వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. సీబీఐ కస్టడీ ముగియడంతో సిసోడియాను కోర్టులో హాజరుపర్చారు. లిక్కర్‌ స్కాంలో ఆయన్ను వారం రోజుల పాటు సీబీఐ విచారించింది.

Delhi Liquor Scam: తీహార్‌ జైలుకు  మనీష్‌ సిసోడియా తరలింపు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌
Manish Sisodia
Sanjay Kasula
|

Updated on: Mar 06, 2023 | 3:30 PM

Share

ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈనెల 20వ తేదీ వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. మరోసారి ఆయన కస్టడీ పొడిగించాలని సీబీఐ కోర్టును కోరలేదు. దీంతో సిసోడియాను తీహార్‌ జైలుకు తరలించారు. సీబీఐ సోమవారం కోర్టులో హాజరుపరిచింది. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రూస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు పొడిగించింది. సిసోడియా డిమాండ్లను కోర్టు అంగీకరించింది. విపాసన సెల్‌ డిమాండ్‌ను కోర్టు అంగీకరించిందని.. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో కళ్లద్దాలు, డైరీ, పెన్ను, భగవత్గీతను తీసుకెళ్లేందుకు మనీష్ సిసోడియా తరపు న్యాయవాది కోర్టు అనుమతి కోరారు. కోర్టు విచారణ అనంతరం ఆప్ తరపు న్యాయవాది సోమనాథ్ భారతి మాట్లాడుతూ తన వద్ద (మనీష్ సిసోడియా) ఏమీ లేదని సీబీఐ అంగీకరించిందని అన్నారు. ఈ ప్రక్రియలో, బెయిల్ దరఖాస్తుపై మార్చి 10 న విచారణ ఉంది. మనీష్ సిసోడియాను మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుతారు. మనీష్ జీ కోర్టులో పెట్టిన డిమాండ్లను ఆమోదించారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మనీష్‌ సిసోడియా. సాక్షులతో కలిపి ఆయన్ను సీబీఐ విచారించింది. అయితే సిసోడియా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీబీఐ వెల్లడించింది.

మనీష్‌సిసోడియాను సీబీఐ మానసికంగా హింసించిందని ఆప్‌ నేతలు ఆరోపించారు. నేరం ఒప్పుకోవాలని ఒత్తడి చేశారని మండిపడ్డారు. మనీష్‌ సిసోడియా పైసా అవినీతికి పాల్పడలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం