హైదరాబాద్ కూకట్పల్లిలో కోటి రూపాయల హవాలా డబ్బు చోరీ జరిగింది. మెట్రో పిల్లర్ 825 వద్ద హవాలా డబ్బును బైక్పై తీసుకెళ్తున్న యువకుల కళ్లలో కారం చల్లి దుండగులు అపహరించారు. ఈ ఘటన ఏసీపీ కార్యాలయం పక్కనే జరగగా, సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.