Manipur Violence: తిరుగుబాటుదార్లను ఉగ్రవాదులతో పోల్చిన మణిపూర్ సీఎం.. 40 మంది ఎన్‌కౌంటర్‌

మణిపూర్‌లో గత కొన్ని రోజులుగా అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిన్న ఒక్క రోజే 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్‌ సీఎం ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో..

Manipur Violence: తిరుగుబాటుదార్లను ఉగ్రవాదులతో పోల్చిన మణిపూర్ సీఎం.. 40 మంది ఎన్‌కౌంటర్‌
CM Biren Singh
Follow us

|

Updated on: May 29, 2023 | 9:19 AM

మణిపూర్‌ రాష్ట్రాం తగలబడిబోతోంది. రెండు తెగల మధ్య ఆధిపత్యపోరులో ఆ రాష్ట్రం హింసతో అల్లాడిపోతోంది. ఈ అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్‌ సీఎం ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో పోల్చారు. ఎమ్‌-16, ఏకే-47, స్నైపర్‌ గన్లతో ఉగ్రవాదులు సాధారణ పౌరులపై దాడికి దిగుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని, ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అల్లర్లలో ఇద్దరు పౌరులు కూడా చనిపోయారు. హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందే తిరుగుబాటుదారులను ప్రభుత్వం అణచివేసింది. ఇక ఈ రోజు అమిత్‌ షా మణిపూర్ ను సందర్శంచనున్నారు.

మే 28 రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌, సెరయు ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మందికిపైగా వ్యక్తులు బుల్లెట్‌ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్ చెప్పారు. మరోవైపు అల్లర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని పాటించి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని ఇప్పటికే మెయిటీ, కుకీ గిరిజన తెగ వర్గాలకు విజ్ఞప్తి చేశారు.

కాగా ఎస్టీ హోదా కోసం మణిపూర్‌ రాష్ట్రంలో గత కొంత కాలంగా నిరసనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మెయిటీల డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..