Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: తిరుగుబాటుదార్లను ఉగ్రవాదులతో పోల్చిన మణిపూర్ సీఎం.. 40 మంది ఎన్‌కౌంటర్‌

మణిపూర్‌లో గత కొన్ని రోజులుగా అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిన్న ఒక్క రోజే 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్‌ సీఎం ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో..

Manipur Violence: తిరుగుబాటుదార్లను ఉగ్రవాదులతో పోల్చిన మణిపూర్ సీఎం.. 40 మంది ఎన్‌కౌంటర్‌
CM Biren Singh
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2023 | 9:19 AM

మణిపూర్‌ రాష్ట్రాం తగలబడిబోతోంది. రెండు తెగల మధ్య ఆధిపత్యపోరులో ఆ రాష్ట్రం హింసతో అల్లాడిపోతోంది. ఈ అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్‌ సీఎం ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో పోల్చారు. ఎమ్‌-16, ఏకే-47, స్నైపర్‌ గన్లతో ఉగ్రవాదులు సాధారణ పౌరులపై దాడికి దిగుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని, ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అల్లర్లలో ఇద్దరు పౌరులు కూడా చనిపోయారు. హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందే తిరుగుబాటుదారులను ప్రభుత్వం అణచివేసింది. ఇక ఈ రోజు అమిత్‌ షా మణిపూర్ ను సందర్శంచనున్నారు.

మే 28 రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌, సెరయు ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మందికిపైగా వ్యక్తులు బుల్లెట్‌ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్ చెప్పారు. మరోవైపు అల్లర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని పాటించి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని ఇప్పటికే మెయిటీ, కుకీ గిరిజన తెగ వర్గాలకు విజ్ఞప్తి చేశారు.

కాగా ఎస్టీ హోదా కోసం మణిపూర్‌ రాష్ట్రంలో గత కొంత కాలంగా నిరసనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మెయిటీల డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..