Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA Alliance: ముగిసిన ఇండియా కూటమి భేటీ.. ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే ..!

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే పేరును బెంగాల్‌ సీఎం మమత ప్రతిపాదించారు.

INDIA Alliance: ముగిసిన ఇండియా కూటమి భేటీ.. ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే ..!
Mallikarjun Kharge-Mamata Banerjee
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 19, 2023 | 6:51 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే పేరును బెంగాల్‌ సీఎం మమత ప్రతిపాదించారు. మమత ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సమర్ధించారు. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అయితే మొదట ఎన్నికల్లో గెలుద్దామని , తరువాత ప్రధాని అభ్యర్ధిపై చర్చిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు, తదితర అంశాలపై మూడు గంటలకు పైగా కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశానికి 28 పార్టీలు హాజరయ్యాయి.

ఈ సమావేశంలో 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేయడంపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపిచ్చింది. సమావేశం అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయన్న ఖర్గే.. సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు గెలవడం ముఖ్యమని.. తమ చింత, దృష్టి అంతా ముందు గెలవడం పైనే అంటూ పేర్కొన్నారు. గెలిచిన తరువాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారంటూ క్లారిటీ ఇచచారు.

దేశ ప్రజల సక్షేమం కోసం కలిసి పనిచేయాలని తాము నిర్ణయించినట్టు ఖర్గే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల లోపు దేశవ్యాప్తంగా 8-10 సమావేశాలు నిర్వహించాలని కూడా కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ, జైరాం రమేశ్‌ , ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ , బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ , తమిళనాడు సీఎం స్టాలిన్‌ , లెఫ్ట్‌ నేతలు , టీఎంసీ నేతలు హాజరయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూయాదవ్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, శివసేన ఉద్దవ్‌ ఠాక్రే , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా సమావేశానికి హాజరయ్యారు.

కాగా.. ఇండియా కూటమి నేతలు సమావేశం కావడం ఇది నాలుగోసారి . పాట్నాలో తొలిసారి కూటమి సమావేశం జరిగింది. తరువాత బెంగళూర్‌, ముంబైలో కూడా నేతలు సమావేశమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్..
ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్..
పాపమోచని ఏకాదశి రోజున ఈ పని చేయండి ఏడాది పొడవునా డబ్బు కొరత ఉండదు
పాపమోచని ఏకాదశి రోజున ఈ పని చేయండి ఏడాది పొడవునా డబ్బు కొరత ఉండదు
'రాసి పెట్టుకో సాంబా.. ఐపీఎల్ 2025లో ఫైనల్ చేరే జట్లు ఇవే'
'రాసి పెట్టుకో సాంబా.. ఐపీఎల్ 2025లో ఫైనల్ చేరే జట్లు ఇవే'
గ్రూప్‌ 1 రీవాల్యుయేషన్‌ చేయాల్సిందే.. TGPSCకి హైకోర్టు నోటీసులు!
గ్రూప్‌ 1 రీవాల్యుయేషన్‌ చేయాల్సిందే.. TGPSCకి హైకోర్టు నోటీసులు!
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
ఢిల్లీ ఉత్కంఠ విజయం.. కట్‌చేస్తే.. పాయింట్ల పట్టికలో కీలక మార్పు
ఢిల్లీ ఉత్కంఠ విజయం.. కట్‌చేస్తే.. పాయింట్ల పట్టికలో కీలక మార్పు
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!