Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలుకలను జిగురు గమ్ ప్యాడ్స్‌తో బంధిస్తున్నారా..? అయితే మీరు జైలుకే

జిగురుతో కూడిన గమ్‌ ప్యాడ్స్‌ సాధారణంగా ప్లాస్టిక్ ట్రేలు, కార్డ్‌బోర్డ్ షీట్‌లపై అంటుకునే బలమైన గమ్‌లాంటి పూతతో తయారు చేస్తారు.. ఇవి విచక్షణారహిత కిల్లర్లుగా పనిచేస్తాయి. ఇలా తయారు చేసిన గమ్‌ ప్యాడ్స్‌పై అతుకున్న జంతువులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో అవయవాలను కూడా కోల్పోవచ్చు.. లేదంటే.. అక్కడే ఆకలితో చనిపోతాయి.

ఎలుకలను జిగురు గమ్ ప్యాడ్స్‌తో బంధిస్తున్నారా..? అయితే మీరు జైలుకే
Rats
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 5:31 PM

సాధారణంగా ఇళ్లల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటే వాటిని తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు ప్రజలు. అందులో భాగంగానే ర్యాట్‌ గమ్‌ప్యాడ్స్‌, బోను వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే, ఎలుకలను పట్టుకోవడానికి ఉపయోగించే (గమ్‌ప్యాడ్స్‌) జిగురు ఉచ్చుల అమ్మకం, ఉత్పత్తి, వాడకాన్ని నిషేధిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, మహా సర్కార్‌ నిర్ణయాన్ని జంతు హక్కుల సంస్థ, పెటా ఇండియా ప్రశంసించింది. జంతువులను పట్టుకోవడానికి ఉపయోగించే ఇలాంటి అమానవీయ ఉచ్చులు దీర్ఘకాల బాధను కలిగిస్తాయి. దాంతో అవి ఎక్కువ సమయం వరకు ఆకలితో అలమటించి మరణిస్తాయని పెటా ఇండియా పేర్కొంది.

అయితే, ఇలాంటి జిగురు ఉచ్చులలో కేవలం ఎలుకలు మాత్రమే కాకుండా పక్షులు, గబ్బిలాలు, పాములు, ఉడుతలు లాంటి ఇతర జంతువులు కూడా పడుతుంటాయి. అలా గమ్‌ ప్యాడ్‌పై అత్తుకుపోయిన మూగజీవాలు.. ఆకలితో చాలా రోజులుగా చాలా బాధాకరమైన మరణాలకు గురవుతున్నాయి. జిగురుతో కూడిన గమ్‌ ప్యాడ్స్‌ సాధారణంగా ప్లాస్టిక్ ట్రేలు, కార్డ్‌బోర్డ్ షీట్‌లపై అంటుకునే బలమైన గమ్‌లాంటి పూతతో తయారు చేస్తారు.. ఇవి విచక్షణారహిత కిల్లర్లుగా పనిచేస్తాయి. ఇలా తయారు చేసిన గమ్‌ ప్యాడ్స్‌పై అతుకున్న జంతువులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో అవయవాలను కూడా కోల్పోవచ్చు.. లేదంటే.. అక్కడే ఆకలితో చనిపోతాయి.

గమ్‌ ప్యాడ్స్‌తో కలిగే అనర్థాలు, కలిగే సమస్యపై స్పందించిన పెటా ఇండియా.. కీలక పాత్ర పోషించింది. ఇలాంటి ర్యాట్‌ గమ్‌ప్యాడ్స్‌ అమ్మకం, తయారీ నిషేధించాలని కోరింది. ఈ సమస్యను చురుగ్గా కొనసాగించిన పెటా ఇండియా ఈ మార్పులో కీలక పాత్ర పోషించింది. గమ్‌ప్యాడ్స్‌ తయారీ, అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ మహారాష్ట్ర పశుసంవర్ధక కమిషనరేట్ ఇటీవల సర్క్యులర్ జారీ చేసిందని వారు వెల్లడించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI)  సలహాను ఈ సర్క్యులర్ ఉదహరించింది.  జిగురు ఉచ్చుల వాడకం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960లోని సెక్షన్ 11ని ఉల్లంఘిస్తుందని నొక్కి చెప్పింది. ఎలుకల నియంత్రణకు మానవీయ విధానం ఆచరించాలని పెటా ఇండియా వాదిస్తోంది. ఆహార వనరులను తొలగించడం, ఎంట్రీ పాయింట్‌లను మూసివేయడం, కేజ్ ట్రాప్‌లను ఉపయోగించడం ద్వారా ఎలుకలను బంధించవచ్చు. ఇలా పట్టుకున్న ఎలుకలను వాటి మనుగడను నిర్ధారించడానికి ఆహారం, నీరు, ఆశ్రయం లభించే ప్రదేశాలలో విడుదల చేయాలని పెటా చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, లడఖ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సహా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు తీసుకున్న ఇలాంటి చర్యలతో మహారాష్ట్ర ప్రభుత్వం చర్య పొత్తు పెట్టుకుంది. సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్. ఈ సమిష్టి ప్రయత్నాలు లెక్కలేనన్ని జంతువులను వేదన కలిగించే మరణాల నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..