AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. బెయిల్ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు.. ఎందుకంటే

గుజరాత్‌లోని చందన్‌ ఠాకుర్ (27) అనే వ్యక్తిని ఓ హత్య కేసులో జైలుకి తరలించారు. దీనివల్ల అతను ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 29న.. అతడి శిక్షను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు రిజస్ట్రీ.. అక్కడి జైలు అధికారులకు ఆర్డరు కాపీని కూడా ఈ-మెయిల్ ద్వారా పంపించింది.

అయ్యో పాపం.. బెయిల్ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు.. ఎందుకంటే
Court Order
Aravind B
|

Updated on: Sep 27, 2023 | 3:37 PM

Share

సాధారణంగా ఎవరైన నేరం చేస్తే వాళ్లు జైలు శిక్షను అనుభవిస్తారు. ఒకవేళ వాళ్లకి బెయిల్ వచ్చినట్లైతే వెంటనే విడుదలైపోతారు. కానీ ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల అతడు మూడేళ్ల వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఇందుకు సంబంధించినటువంటి ఈ-మెయిల్‌లో వచ్చిన ఆర్డరు కాపీని అధికారులు తెరవకపోవడంతో.. ఆ నిందితుడు మూడు సంవత్సరాలు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆ న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. ఆ నిందితుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని చందన్‌ ఠాకుర్ (27) అనే వ్యక్తిని ఓ హత్య కేసులో జైలుకి తరలించారు. దీనివల్ల అతను ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 29న.. అతడి శిక్షను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు రిజస్ట్రీ.. అక్కడి జైలు అధికారులకు ఆర్డరు కాపీని కూడా ఈ-మెయిల్ ద్వారా పంపించింది. కానీ జైలు అధికారులు మాత్రం మెయిల్‌లో ఉన్నటువంటి అటాచ్‌మెంట్‌ను ఏకంగా మూడు సంవత్సర వరకు తెరచి చూడలేదు. దీనివల్ల ఆ నిందితుడు 2023 వరకు జైల్లోనే తన జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అతడు మళ్లీ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల అధికారులు చేసిన నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

బెయిల్ ఆర్డరు కాపీలను కోర్టు రిజస్ట్రీ నుంచి జైలు అధికారులకి చేరినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అటాచ్‌మెంట్‌ను మాత్రం తెరిచి చూడలేకపోయారు. అంతేకాదు.. ఆ ఈ-మెయిల్‌ను జిల్లా సెషన్స్‌ కోర్టుకు కూడా పంపించారు. కానీ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే. అధికారులు సరైన పర్యవేక్షణ చేయలేకపోయారు. వాస్తవానికి ఆ దరఖాస్తుదారునికి బెయిల్ వచ్చిన కూడా అతడు ఆ స్వేచ్ఛను ఆస్వాదించలేకపోయాడు అని గుజరాత్ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. కరోనా సమయంలో కూడా ఇలా ఈ మెయిల్స్‌లో వచ్చినటువంటి ఆదేశాలు అమలయ్యాయా లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో గుజరాత్ హైకోర్టు.. ఇందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేయాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీకి సూచనలు చేసింది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ కేసు విషయంలో అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?