AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra CM: షిండే ముంబై వస్తారా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠకు తెరపడనుందా?

మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఇప్పట్లో ఖరారు కానప్పటికీ.. బీజేపీ నుంచి సీఎం అవుతారన్నదీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీఎం అభ్యర్థి ఖరారు కానప్పటికీ ప్రమాణస్వీకార తేదీ, స్థలం ఖరారయ్యాయి.

Maharashtra CM: షిండే ముంబై వస్తారా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠకు తెరపడనుందా?
Eknath Shinde Devendra Fadnavis
Balaraju Goud
|

Updated on: Dec 01, 2024 | 3:14 PM

Share

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడిచినా మహాయుతి అధికార రహస్యం ఇంకా వీడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సమస్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఇప్పట్లో ఖరారు కానప్పటికీ.. భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం తన స్వగ్రామమైన సతారాలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన ముంబై చేరుకునే అవకాశం ఉంది. ఈ సాయంత్రంలోగా షిండే ముంబైకి రాకపోతే, అది మళ్లీ అతని అసంతృప్తికి ముడిపడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

మహారాష్ట్రలో ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. ఈ విషయాన్ని షిండే గ్రూప్‌ లీడర్‌ సంజయ్‌ శిర్సత్‌ వెల్లడించారు. షిండే ఆరోగ్యం కాస్త విషమించిందని, అందుకే స్వగ్రామంలో ఉండిపోయారని శిర్సత్ తెలిపారు. ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంది. ఆయన సతారా నుంచి ముంబై వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సాయంత్రం లేదా రేపు మహాయుతి సభ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో మంత్రి పదవిపై ఏకాభిప్రాయం కుదరనుంది. షిండే వర్గానికి హోంమంత్రి, ఆర్థిక మంత్రికి సంబంధించిన విషయానికి పరిష్కారం దొరుకుతుందని సంజయ్ శిర్సత్ అభిప్రాయపడ్డారు.

మంత్రివర్గం విషయంలో మహాయుతిలో ఎలాంటి చీలిక లేదంటున్నారు మూడు పార్టీల నేతలు. ఢిల్లీలో సీఎం పదవిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ షిండేకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. తాత్కాలిక సీఎం షిండే గత 2 రోజులుగా తన స్వగ్రామమైన సతారాలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో థానే చేరుకుంటారు. ఇదిలావుంటే, ఏక్‌నాథ్ షిండే శుక్రవారం అకస్మాత్తుగా స్వగ్రామానికి చేరుకున్నారు. షిండే సతారా వెళ్లడం వల్ల మహారాష్ట్రలో ఎన్డీయే ప్రతిపాదిత సమావేశం రద్దయింది. షిండే మంత్రిగా ఆర్థిక, హోం శాఖలను కోరుతున్నారు. గత ప్రభుత్వంలో హోం, ఆర్థిక శాఖలు రెండూ ఉప ముఖ్యమంత్రి వద్ద ఉండేవి. ప్రస్తుతం బీజేపీ నుంచి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. బీజేపీ ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు పీడబ్ల్యూడీ ఆఫర్ చేసింది.

మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఇప్పట్లో ఖరారు కానప్పటికీ.. బీజేపీ నుంచి సీఎం అవుతారన్నదీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీఎం అభ్యర్థి ఖరారు కానప్పటికీ ప్రమాణస్వీకార తేదీ, స్థలం ఖరారయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 5 మధ్యాహ్నం 1 గంటలకు జరుగుతుంది. ఈ వేడుకను ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహిస్తారని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..