Jagannath Chariot: జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..! వీటి స్పెషల్ ఏంటంటే..
ఈ విషయాన్ని కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ ఇస్కాన్ వెల్లడించింది. గతంలో ఈ ఆలయంలోని స్వామి వారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించేవారు. కానీ, 15 ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్కు సాధ్యం కాలేదు. ఈ రథం గంటకు 1.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రష్యన్ సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు రన్వేపై నడుస్తూ గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలవు.

ఈ యేడు జగన్నాథ రథ యాత్ర.. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సాగనుంది. జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్-30 కోసం తయారు చేసిన యుద్ధ విమానం టైర్లను వాడుతున్నారు. ఈ విషయాన్ని కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ ఇస్కాన్ వెల్లడించింది. గతంలో ఈ ఆలయంలోని స్వామి వారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించేవారు. కానీ, 15 ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్కు సాధ్యం కాలేదు. ఈ రథం గంటకు 1.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రష్యన్ సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు రన్వేపై నడుస్తూ గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలవు.
గత సంవత్సరం జగన్నాథుని రథంలో స్టీరింగ్ సమస్య తలెత్తిన తర్వాత ఈ మార్పు జరిగిందని ఇస్కాన్ నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు జరిగిన శోధన తర్వాత కొత్త టైర్లు అమర్చారు. దాని వ్యాసం కూడా 4 అడుగులు, బరువు 110 కిలోలు ఉంటుంది.
వీడియో ఇక్కడ చూడండి..
సుఖోయ్ కొత్త టైర్లు రథాన్ని నడపడానికి సులభతరం చేస్తాయి. ఇది రథాన్ని మరింత సురక్షితంగా, స్థిరంగా ఉంచుతుంది. ముఖ్యంగా కోల్కతా రోడ్లపై చాలా చోట్ల ట్రామ్ ట్రాక్లు ఉన్నాయి. దీని వలన రథం లాగే భక్తులపై ఒత్తిడి తగ్గుతుంది. సాంకేతిక లోపాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. టైర్లు మార్చే పని ఇంకా కొనసాగుతోంది. ఈ పని జూన్ రెండవ వారం నాటికి, రథయాత్రకు ముందు పూర్తవుతుందని భావిస్తున్నారు. సాంప్రదాయ నిర్మాణాన్ని మార్చకుండా కొత్త చక్రాలను సురక్షితంగా అమర్చడం అతిపెద్ద సవాలుగా మారిందని నిర్వాహకులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




