ముక్కులో నిమ్మరసం వేస్తే కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా ?శాస్త్రీయ ఆధారాల్లేవ్ !

కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ముక్కులో నిమ్మరసం చుక్కలు రెండు వేసుకుంటే చాలునని ఇటీవల కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అసలు కోవిడ్ దరి చేరదని,..

ముక్కులో నిమ్మరసం వేస్తే కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా ?శాస్త్రీయ ఆధారాల్లేవ్ !
Lemon Thearapy, Video
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 9:02 PM

కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ముక్కులో నిమ్మరసం చుక్కలు రెండు వేసుకుంటే చాలునని ఇటీవల కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అసలు కోవిడ్ దరి చేరదని, ఇమ్యూనిటీ పెరుగుతుందని వీరు వీడియోల్లో చాటుకుంటున్నారు. కానీ ఇందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని ఓ అధ్యయనంలో తేలింది. నిమ్మ కాయ, లేదా నిమ్మరసం ఆరోగ్యానికి మంచివే కానీ వీటివల్ల కరోనా వైరస్ నశిస్తుందని చెప్పలేమని, ఆ వీడియోలు ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్టడీస్ లో తేలింది. సదరు వీడియోలో ఓ వ్యక్తి చేసిన ప్రకటనను నమ్మరాదని ఈ అధ్యయనం వెల్లడించింది.ఈ విధమైన ప్రకటనలు మంచి కన్నా హాని ఎక్కువగా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేద పరంగా మిరియాలు, పసుపు కలిపిన పాలు, కషాయం వంటివి కోవిద్ అదుపులో సహకరిస్తాయని .ఇంటింటి వైద్యం’ చెబుతున్నాయి. అయితే జలుబు, పొడి దగ్గు వంటి స్వల్ప లక్షణాలను ఇవి కొంతవరకు అదుపు చేయగలుగుతాయి. వంటింటి వైద్యం మంచిదే అయినా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని కూడా అంటున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో 82 ఏళ్ళ మహిళ కోవిడ్ పాజిటివ్ సోకినప్పటికీ ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ నియంత్రణలో ఉంటూ 14 రోజులపాటు ఆయుర్వేద చికిత్స తీసుకుందట… పైగా రోజుకు మూడు సార్లు బోర్లా పడుకుంటూ ఉండడం వల్ల ఆమెలో ఆక్సిజన్ లెవెల్ పెరిగిందట.. అలా ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలైనట్టు , కోలుకున్నట్టు వార్తలు వచ్చాయి. మిరియాలు కలిపిన రసాన్ని పీల్చడం వల్ల కూడా ఆమె ఆరోగ్యం మెరుగు పడిందట..అయితే ఆమె ఇవన్నీ డాక్టర్ల పర్యవేక్షణలో చేసింది.

ఇంటివైద్యమయినా, ఆయుర్వేద మందులతో నైనా ఈ మహమ్మారిని అదుపు చేయగలమనుకుంటే ఇన్ని హాస్పటల్స్, ఐసీయూలు ఎందుకు అనేవారు కూడా ఉన్నారు. అయితే శాస్త్రీయ విధానాల ఆమోదం ఉన్నప్పుడు దేనినైనా స్వీకరించ వచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో చేసే సూచనలను పట్టించుకోరాదని వీరు ఢంకా బజాయించి చెబుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు