Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోల్ కతా అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా

కోల్ కతా లోని రైల్వే బిల్డింగ్ కార్యాలయంలో రేగిన మంటల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కోల్ కతా అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 09, 2021 | 10:55 AM

కోల్ కతా లోని రైల్వే బిల్డింగ్ కార్యాలయంలో రేగిన మంటల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయ నిధి కింద పీఎంఓ కార్యాలయం  రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.  తీవ్రంగా గాయపడినవారికి 50 వేల సాయాన్ని అందజేయాలని ఈ కార్యాలయం సూచించింది. 13 వ అంతస్థులో తలెత్తిన మంటలు మిగతా అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయని, ముఖ్యంగా 12 వ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైందని రైల్వే అధికారులు  తెలిపారు. తొమ్మిది మృత దేహాల్లో  ఐదింటిని 12 వ అంతస్థులో గుర్తించారు. బాధితులు ఊపిరాడక లిఫ్ట్ లో సజీవ దహనమైనట్టు తెలుస్తోంది.ఇంత ఘోర ప్రమాదానికి కారణాలను ఇంకా పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఎలివేటర్ ను వాడిన కారణంగా తీవ్రత పెరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు రైల్వే ఉద్యోగులు, ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ సజీవ దహనమయ్యారు.

ఈ భవనంలో రెండు జోనల్ రైల్వే కార్యాలయాలు, కంప్యూటరీకరించిన టికెట్ బుకింగ్ సెంటర్ ఉన్నాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆన్ లైన్ బుకింగులను కూడా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించారు. గాయపడినవారికి  తక్షణం  మెరుగైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం మమతా బెనర్జీ, కొందరు రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అటు- మృతుల సంఖ్య పెరగ వచ్చునని భావిస్తున్నారు. ఈస్టర్న్ రైల్వే సెక్షన్ లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Karthika Deepam Serial : ఓ వైపు పిల్లలతో ఊరుదాటిన దీప.. మరోవైపు మోనిత మాయలో కార్తీక్..

కంటెంట్ ఉన్న పాత్రలకే కన్ఫర్మేషన్.. మ్యాటర్ లేదంటే రిజెక్ట్.. భార్యపై పొగడ్తల వర్షం కురిపిస్తున్న తమిళ యువహీరో..

కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలో ప్రసంగిస్తూ విద్యార్ధిని మృతి.. వీడియో
కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలో ప్రసంగిస్తూ విద్యార్ధిని మృతి.. వీడియో
ఆష్లీ గార్డనర్ పెళ్లి ఫొటోలు వైరల్.. ప్రేమకు పరాకాష్ఠ!
ఆష్లీ గార్డనర్ పెళ్లి ఫొటోలు వైరల్.. ప్రేమకు పరాకాష్ఠ!
వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌!
వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌!
శ్రీవారి సాక్షిగా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్
శ్రీవారి సాక్షిగా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్
ఒక్క క్షణం ఆలస్యమైతే అంతే.. వీడియో
ఒక్క క్షణం ఆలస్యమైతే అంతే.. వీడియో
కైలాసలో నిత్యానంద భూ దందా.. 20 మంది శిష్యులపై బహిష్కరణ వీడియో
కైలాసలో నిత్యానంద భూ దందా.. 20 మంది శిష్యులపై బహిష్కరణ వీడియో
ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. పెట్టుబడికి బోలెడంత భరోసా..!
ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. పెట్టుబడికి బోలెడంత భరోసా..!
కాస్ట్‌లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే ..
కాస్ట్‌లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే ..
అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో
అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో
ఈ అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు 10 వేల కన్నా తక్కువ ధరకే..
ఈ అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు 10 వేల కన్నా తక్కువ ధరకే..