AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ కోసం 15ఏళ్ల బాలిక ఘాతుకం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా నరికి..

బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి ఆమె తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. తండ్రి హత్యకు అడ్డుపడ్డ తమ్ముడిని కూడా హతమార్చారు. ఈ రెండు హత్యల తరువాత, వారు దాదాపు మూడు నెలల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్‌ ఇంకా పరారీలోనే ఉన్నట్టుగా తెలిసింది.

ప్రేమ కోసం 15ఏళ్ల బాలిక ఘాతుకం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా నరికి..
Crime Scene
Jyothi Gadda
|

Updated on: May 31, 2024 | 8:10 AM

Share

తన తండ్రి, తమ్ముడిని దారుణంగా హత్య చేసింది ఒక 15 ఏళ్ల బాలిక. తన ప్రేమకు అడ్డుపడుతున్నారనే కోపంతో ఆ ఇద్దరినీ చంపి మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచిపెట్టంది. మార్చి 15న మైనర్ బాలిక తన 19 ఏళ్ల ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకుని పారిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘాతుకానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ బాలిక ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. రెండున్నర నెలల తరువాత ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బుధవారం ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది.

రైల్వేలో క్లర్క్‌గా పనిచేసే రాజ్‌కుమార్‌ విశ్వకర్మ కుమార్తె అయిన ఈ బాలిక ముకుల్‌ సింగ్‌ (19) అనే యువకుడితో ప్రేమలో పడింది. 2023 సెప్టెంబరులో ఆ అమ్మాయి ముకుల్‌తో కలిసి పారిపోయింది. దాంతో తల్లిదండ్రులు వారి కోసం గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువకుడిపై పోక్సో చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి ఆమె తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. తండ్రి హత్యకు అడ్డుపడ్డ తమ్ముడిని కూడా హతమార్చారు. మృతదేహాలను ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి పరారయ్యారు. ఈ రెండు హత్యల తరువాత, వారు దాదాపు మూడు నెలల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్‌ ఇంకా పరారీలోనే ఉన్నట్టుగా తెలిసింది.

మార్చి 15న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హత్య జరగగా, అప్పటి నుంచి బాలిక పరారీలో ఉంది. ఆమె 19 ఏళ్ల ప్రియుడు కూడా ఈ కేసులో నిందితుడని, అతడు ఇంకా పరారీలో ఉన్నాడని హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర దోభాల్ నివేదించారు. విచారణలో బాలిక అంగీకరించనట్టుగా వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..