AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ పై వాషింగ్టన్ పోస్ట్ విష ప్రచారం.. ‘ పండిట్ల ‘ నిరసన

జమ్మూ కశ్మీర్ పై అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ డైలీ విష ప్రచారం చేస్తోందని ఆ దేశంలోని కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పత్రిక కాశ్మీర్ విషయంలో ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా వార్తలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శనివారం వారు పత్రిక కార్యాలయం వద్ద ప్రొటెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, ఆంక్షల పేరిట జర్నలిస్టులను వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించేవారి నోళ్లు నొక్కుతున్నారని ఈ పత్రిక లేనిపోని వార్తలు ప్రచురిస్తోందని గ్లోబల్ కాశ్మీర్ పండిట్ […]

కశ్మీర్ పై వాషింగ్టన్ పోస్ట్ విష ప్రచారం.. ' పండిట్ల ' నిరసన
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Sep 08, 2019 | 4:30 PM

Share

జమ్మూ కశ్మీర్ పై అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ డైలీ విష ప్రచారం చేస్తోందని ఆ దేశంలోని కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పత్రిక కాశ్మీర్ విషయంలో ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా వార్తలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శనివారం వారు పత్రిక కార్యాలయం వద్ద ప్రొటెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, ఆంక్షల పేరిట జర్నలిస్టులను వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించేవారి నోళ్లు నొక్కుతున్నారని ఈ పత్రిక లేనిపోని వార్తలు ప్రచురిస్తోందని గ్లోబల్ కాశ్మీర్ పండిట్ డయాస్పోరా సంస్థ సభ్యులు దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి పరిణామాలను వాషింగ్టన్ పోస్ట్ డైలీ వక్రంగా చిత్రీకరిస్తోందని వారన్నారు. ఇండియాలో మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని, 35 ఎని రద్దు చేసిన అనంతరం ఈ రాష్ట్రంలో హింస, ఉద్రిక్తత పెరిగాయనడం సరి కాదన్నారు. నిజానికి మోదీ సాహసోపేతమైన, చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని కాశ్మీరీ పండిట్లు అభినందిస్తూ.. తన రాతలకు ఈ పత్రిక అపాలజీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కన్నా ఇప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంతృప్తికరంగా ఉందన్నారు. కశ్మీర్ వాస్తవాధీన రేఖ వద్ద పాక్ ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తున్నా నోరెత్తని ఈ పత్రిక కేవలం ఇండియా మీద బురద జల్లడానికే ఇలాంటి వార్తలు ప్రచురిస్తోందని పండిట్లు ఆరోపించారు. ఈ డైలీకి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ తన ఆర్టికల్ ని సమర్థించుకుంది. నిజంగానే జమ్మూ కశ్మీర్ లో అనిశ్చిత వాతావరణం ఏర్పడిందని, ముఖ్యంగా విదేశీ జర్నలిస్టులపై లేనిపోని ఆంక్షలను అమలు చేస్తోందని పేర్కొంది. ఆ రాష్ట్రంలోని వాస్తవ సంఘటనలు, తదితర సమాచారాన్ని సేకరించేందుకు వారిని అనుమతించడంలేదని ఆరోపించింది. మేం మా వాదనకు కట్టుబడి ఉన్నాం అని ఈ డైలీ ఎడిటర్ స్పష్టం చేశారు.

Follow Us
సైనా నెహ్వాల్ ’ఫైటర్ మామ్‘ వీడియో వైరల్
సైనా నెహ్వాల్ ’ఫైటర్ మామ్‘ వీడియో వైరల్
రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు..!
రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు..!
దీంతో చేసిన బిర్యానీలు, చాక్లెట్లు హెల్తీ.. సీక్రెట్స్ ఇవే
దీంతో చేసిన బిర్యానీలు, చాక్లెట్లు హెల్తీ.. సీక్రెట్స్ ఇవే
సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది..
సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది..
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..