Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashi Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ సన్నాహాలు.. ప్రోటోకాల్ దర్శనంపై నిషేధం, ప్రత్యక్ష దర్శన సౌకర్యం..

వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ మాసం కోసం ఏర్పాట్లకు సంబంధించి ఆలయ పరిపాలన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. శ్రావణ దర్శనం కోసం ప్రత్యేక ప్రోటోకాల్‌లు అమలు చేయనున్నామని ఆలయ సిబ్బంది తెలిపారు. ఏ కారణం చేతనైనా విశ్వనాథ ఆలయానికి రాలేదని భక్తుల కోసం.. కాశీ విశ్వనాథ్ మహాదేవ దర్శన-ఆరాధనకి సంబంధించిన ప్రత్యక్ష దర్శన సౌకర్యం కూడా పవిత్ర శ్రావణ మాసంలో అందుబాటులో ఉంటుంది.

Kashi Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ సన్నాహాలు.. ప్రోటోకాల్ దర్శనంపై నిషేధం, ప్రత్యక్ష దర్శన సౌకర్యం..
Kashi Vishwanath Temple
Surya Kala
|

Updated on: Jun 20, 2025 | 9:21 AM

Share

ఉత్తరాదిలో హిందూ నెల పౌర్ణమి తిధి నుంచి పౌర్ణమి తిధి వరకూ నెల రోజులుగా పరిగణించబడుతుంది. ఈ నేపధ్యంలో జూలై 11వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం అధికారులు శ్రావణ మాసం ఏర్పాట్లకు సంబంధించి పరిపాలన సమావేశం నిర్వహించింది. సమావేశంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి శ్రావణ మాసంలోని అన్ని రకాల ప్రోటోకాల్ దర్శనాలపై పూర్తి నిషేధం విధించాలని సమావేశంలో నిర్ణయించారు. కాశీ ప్రజలకు, భక్తులకు ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు శకట దర్శన సౌకర్యం లభిస్తుంది. అయితే శ్రావణ మాసంలోని సోమవారం, ఇతర పండుగల సమయంలో మాత్రం ఈ శకట దర్శనం ఉండదు.

మహా కుంభమేళా మాదిరిగానే శ్రావణ మాసంలో విశ్వనాథ ఆలయానికి వెళ్ళే సామాన్య భక్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. భక్తులు ఖాళీ కడుపుతో క్యూలో నిలబడకూడదు.. ఎందుకంటే ఎక్కువ రద్దీ కారణంగా.. విశ్వనాథుని దర్శనానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కనుక భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్యూలో ఈ వస్తువులు నిషేధం ఆలయంలోకి అడుగు పెట్టే ముందు.. క్యూలో నిలబడే భక్తులు కొన్ని వస్తువులను తీసుకుని రావద్దని ఆలయ సిబ్బంది భక్తులకు సూచించారు. నిషేధించిన వస్తువులను అంటే డిజిటల్ గడియారాలు, మొబైల్స్, ఇయర్‌ఫోన్‌లు, పొగాకు, మత్తు పదార్థాలు, సౌందర్య సాధనాలు, పెద్ద బ్యాగులు వంటి వాటిని విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లడానికి వీలు లేదు. ఈ వస్తువులను తీసుకుని భక్తులు క్యూలో నిలబడకూడదని కూడా ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యక్ష దర్శనానికి కూడా సదుపాయం ఉంటుంది.

ఏ కారణం చేతనైనా కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకోలేని భక్తులకు.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథ మహాదేవుని దర్శనం, ఆరాధనని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని కాశీ విశ్వనాథ్ ఆలయ సిఇఒ విశ్వభూషణ్ మిశ్రా తెలిపారు. ప్రత్యక్ష దర్శనం కోసం ఆలయ ట్రస్ట్ వెబ్‌సైట్, ఆలయ ట్రస్ట్ అధికారిక యూట్యూబ్ ఛానల్ , అధికారిక ప్రసార భాగస్వామి టాటా స్కై ద్వారా ప్రత్యక్ష దర్శన సదుపాయం భక్తులకు అందుబాటులో ఉంటుంది.

మహా కుంభలో వలెనే శ్రావణ మాసంలోనూ ట్రాఫిక్, పార్కింగ్, జనసమూహ నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతాయి. జనసమూహం లేకుండా ధామ్ లో జిగ్ జాగ్ బారికేడింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఈసారి శ్రావణ మాసంలో హారతి టిక్కెట్ల ధరలో పెంపుదల లేదని చెప్పారు. శ్రావణ సోమవారం కాశీ విశ్వనాథుని దర్శనం కోసం పది లక్షలకు పైగా భక్తులు ఆలయానికి చేరుకుంటారని.. ఆలయ పరిపాలన అంచనా వేస్తోంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..