AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Promissory Note: ప్రామిసరీ నోటు ఎలా వ్రాయాలి.? ఎన్ని రూపాయలు వరకు వ్రాయొచ్చు.!

ప్రముఖ న్యాయవాది ఒకరు అప్పు వసూలుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు. ప్రామిసరీ నోటు ప్రాముఖ్యత, దాని కాలపరిమితి, చెక్కు బౌన్స్ కేసుల చట్టపరమైన చిక్కులు, సాక్ష్యాలు లేని మౌలిక ఒప్పందాల వల్ల ఎదురయ్యే సవాళ్లను గురించి ఆయన తెలిపారు. ఆ వివరాలు ఇలా..

Promissory Note: ప్రామిసరీ నోటు ఎలా వ్రాయాలి.? ఎన్ని రూపాయలు వరకు వ్రాయొచ్చు.!
Promissory Note
Ravi Kiran
|

Updated on: Mar 19, 2026 | 12:47 PM

Share

మన నిత్య జీవితంలో డబ్బు లావాదేవీలు అనివార్యం. అయితే, అప్పు తిరిగి రాబట్టుకోవడంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అటువంటి పరిస్థితులలో చట్టపరమైన రక్షణలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖ న్యాయవాది ఒకరు కీలక విషయాలు తెలిపారు. డబ్బుకు సంబంధించిన ప్రతి లావాదేవీకి చట్టపరమైన అవగాహన చాలా అవసరం అని ఆయన నొక్కి చెప్పారు.

ప్రామిసరీ నోటు ప్రాముఖ్యత, కాలపరిమితి

ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బు లావాదేవీలలో ప్రామిసరీ నోటు ఓ సాధనం. అప్పు తీసుకున్న వ్యక్తి, తీసుకున్న మొత్తాన్ని, దానికి సంబంధించిన వడ్డీ(ఉదాహరణకు, 3 శాతం లేదా 6 శాతం), తిరిగి చెల్లించాల్సిన కాలపరిమితి (ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం) స్పష్టంగా పేర్కొంటూ రాసి ఇచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోటు అంటారు. సామాన్య ప్రజలలో 95 శాతం మంది ఈ ప్రామిసరీ నోటును ఆధారంగా చేసుకొనే అప్పులు ఇస్తుంటారు, తీసుకుంటుంటారు. అయితే, ఈ నోటు రాసేటప్పుడు ఇద్దరు సాక్షులు ఉండటం చాలా ముఖ్యం. అప్పు ఇచ్చే వ్యక్తి ప్రామిసరీ నోటుకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని గుర్తుంచుకోవాలి. నోటు రాసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోపు వడ్డీతో సహా అప్పును వసూలు చేసుకోవాలి. లేకపోతే, ఆ ప్రామిసరీ నోటు తన చెల్లుబాటును కోల్పోతుంది. ఆ తర్వాత కోర్టులో మనీ రికవరీ సూట్ వేసే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మూడు సంవత్సరాల తర్వాత కూడా అప్పు తిరిగి రాకపోతే, ప్రస్తుత ప్రామిసరీ నోటును రద్దు చేసి, అప్పు ఇచ్చిన, తీసుకున్న వ్యక్తులు కలిసి కొత్త ప్రామిసరీ నోటును రాసుకోవడం ద్వారా దాని కాలపరిమితిని మరో మూడు సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు.

చెక్కు బౌన్స్ కేసుల చట్టపరమైన కోణాలు

కొంతమంది ప్రామిసరీ నోటు ఉన్నప్పటికీ, అప్పు తిరిగి చెల్లించమని అడిగినప్పుడు చెక్కు ఇస్తుంటారు. అయితే, ఆ చెక్కును బ్యాంకులో వేసినప్పుడు ఇన్సఫిషియంట్ ఫండ్స్ కారణంగా బౌన్స్ అవుతుంది. ఇలాంటప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి క్రిమినల్ కేసులో ఇరుక్కుంటాడు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్(ఎన్ఐ) యాక్ట్, సెక్షన్ 138 ప్రకారం చెక్కు బౌన్స్ కేసును క్రిమినల్ కేసుగా పరిగణిస్తారు. అయితే దీనికి సివిల్ లక్షణాలు ఉంటాయి. చెక్కు బౌన్స్ అయినప్పుడు, బ్యాంకు రిటర్న్ మెమో ఇస్తుంది. అప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి న్యాయవాది ద్వారా లీగల్ నోటీసును పంపించి, 15 రోజుల్లోగా డబ్బు చెల్లించమని కోరాలి. ఈ గడువులోగా చెల్లింపు జరగకపోతే, అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో చెక్కు బౌన్స్ కేసును ప్రైవేట్ కేసుగా ఫైల్ చేయవచ్చు. ఈ కేసులో పోలీసులు ప్రమేయం ఉండదు. కోర్టులో అప్పు ఇచ్చిన వ్యక్తి తన అప్పును నిరూపించుకుంటే, అప్పు తీసుకున్న వ్యక్తికి కోర్టు శిక్ష విధించడంతో పాటు డబ్బును తిరిగి ఇప్పిస్తుంది. అప్పు తీసుకున్న వ్యక్తి కావాలనే డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కోర్టు భావిస్తే, అదనపు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

మౌలిక ఒప్పందాలు, బ్యాంకు లావాదేవీలు

కొంతమంది ప్రామిసరీ నోటు లేదా చెక్కులు లేకుండా కేవలం నమ్మకం మీద చేబదులుగా గానీ, ఆన్‌లైన్ లేదా బ్యాంకు ద్వారా గానీ అప్పులు ఇస్తుంటారు. ఇటువంటి సందర్భాలలో అప్పు తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టం. నమ్మకం ఆధారంగా జరిగిన మౌలిక ఒప్పందాలపై కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు, కానీ కేసు గెలవడానికి బలమైన సాక్ష్యాలు అవసరం. మౌలిక ఒప్పందం జరిగినప్పుడు సాక్షులు ఉన్నారా, ఆ సంఘటన ఎప్పుడు జరిగింది వంటి వివరాలను నిరూపించగలిగితేనే డబ్బును తిరిగి పొందడం లేదా అతని ఆస్తులను అటాచ్మెంట్ చేయించుకోవడం సాధ్యపడుతుంది. క్యాష్ రూపంలో చేబదులు ఇచ్చినప్పుడు రుజువులు ఉండవు కాబట్టి మరింత కష్టం. అయితే, బ్యాంకు ద్వారా జరిగే ఆన్‌లైన్ లావాదేవీలు లేదా ట్రాన్స్‌ఫర్‌లకు బ్యాంకు స్టేట్‌మెంట్ల రూపంలో స్పష్టమైన ఆధారాలు ఉంటాయి. ఇవి అప్పు ఇచ్చినట్లు నిరూపించడానికి సహాయపడతాయి. మౌఖిక ఒప్పందాల కంటే మార్టిగేజ్ డీడ్‌లు (ఆస్తిని తాకట్టు పెట్టి) లేదా లీగల్ డీడ్‌ల ద్వారా అప్పులు ఇవ్వడం వల్ల డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి ఎక్కువ చట్టపరమైన అవకాశాలు ఉంటాయని శ్రీనివాస్ చౌహాన్ గారు సూచించారు. డబ్బు లావాదేవీలలో ఎల్లప్పుడూ చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చెక్కు బౌన్స్ కేసులలో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు.

Follow Us