AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: కర్ణాటక రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వందశాతం కన్నడిగులకే ఉద్యోగాలు..!

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

Karnataka: కర్ణాటక రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వందశాతం కన్నడిగులకే ఉద్యోగాలు..!
Siddaramaiah Dk Shivakumar
Balaraju Goud
|

Updated on: Jul 17, 2024 | 9:38 AM

Share

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విప్లవాత్మక బిల్లును జూలై 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కర్నాటక ప్రభుత్వం.

ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్‌ సంస్థల్లోని గ్రూప్‌-సి, గ్రూప్‌-డి పోస్టులను కచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కేటగిరిలో 50శాతం మందిని, నాన్‌-మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో 70శాతం మందిని, కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేట్‌ సంస్థకైనా ఈ రూల్‌ను తప్పనిసరి చేయబోతోంది ప్రభుత్వం.

మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సులను ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. దీని అమలుతో ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అయితే దీని అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పెరుగుతుంది. ఏడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని 27.5 శాతం పెంచాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే సుధాకర్‌రావు నేతృత్వంలోని ఏడో వేతన సంఘం సిఫారసు చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.17,440.15 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…