Darshan Puttanaiah: ట్రైన్‌లో సాధారణ ప్రయాణీకుడిలా ఎమ్మెల్యే.. టెక్కీ నుంచి రైతు నాయకుడు.. ఎమ్మెల్యేగా తొలిసారి ఎంపిక

సోమవారం ఉదయం మండ్యలోని పాండవపుర రైల్వే స్టేషన్‌లో చాముండి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈ చాముండి ఎక్స్‌ప్రెస్ ప్రభుత్వ ఉద్యోగులు, గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ కార్మికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమతో పాటు ట్రైన్ లో ప్రయాణిస్తున్న   ఎమ్మెల్యే దర్శన్  కూర్చునేందుకు ప్రయాణికులు ఖాళీ చేసి సీటునిచ్చారు. 

Darshan Puttanaiah: ట్రైన్‌లో సాధారణ ప్రయాణీకుడిలా ఎమ్మెల్యే.. టెక్కీ నుంచి రైతు నాయకుడు.. ఎమ్మెల్యేగా తొలిసారి ఎంపిక
Mla Darshan Puttanaiah
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 22, 2023 | 2:25 PM

ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజల మధ్య తిరిగే రాజకీయ నేతలు.. ఎన్నికల్లో విజయం సాధించి తర్వాత అదే ప్రజల మధ్య ప్రయాణం చేయాలంటే మాత్రం వెనుకాడుతారు. ప్రోటోకాల్ పేరుతో ప్రజా ప్రతినిధులు స్పెషల్ వాహనాల్లో ప్రయాణిస్తారు.  అయితే కర్ణాటకలో షాకింగ్ కలిగించే ఘటన చోటు చేసుకుంది. విధాన సౌధలో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యేందుకు మేలుకోటే ఎమ్మెల్యే దర్శన్ పుట్టనయ్య సోమవారం మాండ్యా నుంచి బెంగళూరుకు ఓ సామాన్య ప్రయాణీకుడిలా రైలులో ప్రయాణించారు. దర్శన్ పుట్టనయ్య రైతు నాయకుడు. మాండ్య నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పుట్టన్నయ్య ఎంపికయ్యారు. సోమవారం ఉదయం మండ్యలోని పాండవపుర రైల్వే స్టేషన్‌లో చాముండి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈ చాముండి ఎక్స్‌ప్రెస్ ప్రభుత్వ ఉద్యోగులు, గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ కార్మికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమతో పాటు ట్రైన్ లో ప్రయాణిస్తున్న   ఎమ్మెల్యే దర్శన్  కూర్చునేందుకు ప్రయాణికులు ఖాళీ చేసి సీటునిచ్చారు.

తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం అనంతరం శనివారం తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కూడా దర్శన్  పుట్టన్నయ్య బెంగళూరు రైలులోనే వెళ్లారు. అప్పుడు దర్శన్ టీ-షర్ట్, షార్ట్ ధరించి ప్రయాణించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల దర్శన్ గతంలో టెక్కీగా పనిచేశారు. USలో నివసించే సమయంలో  USAలోని డెన్వర్‌లో Qwinix టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. తన తండ్రి, రైతు నాయకుడు ఎమ్మెల్యే కేఎస్ పుట్టన్నయ్య అకస్మాత్తుగా మరణించడంతో భారతదేశానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో మేల్కోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి సీఎస్ పుట్టరాజుపై దర్శన్ పుట్టనయ్య 10,862 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..