AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డుప్రమాదం.. ఐషర్‌ లారీ, ఆటో ఢీకొని ఏడుగురు మృతి, ఆరుగురికి గాయాలు..

ఐషర్ లారీ, ఆటో మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 7కి చేరింది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే ఐదుగురు మరణించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

ఘోర రోడ్డుప్రమాదం.. ఐషర్‌ లారీ, ఆటో ఢీకొని ఏడుగురు మృతి, ఆరుగురికి గాయాలు..
Accident In Bidar
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2022 | 10:44 AM

Share

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఐషర్‌ లారీ, ఆటో ఢీకొడంతో ఘోర ప్రమాదం జరిగింది. బీదర్ జిల్లా చిటగుప్ప తాలూకా బెమ్మల్‌ఖెడ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐషర్ లారీ, ఆటో మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 7కి చేరింది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే ఐదుగురు మరణించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బీదర్ జిల్లా చిటగుప్ప తాలూకాలోని బెమ్మల్‌ఖెడ గ్రామ సమీపంలో ఐషర్ ట్రక్కు, ఆటో మధ్య శుక్రవారం జరిగింది ఈ ఘోర ప్రమాదం.

నిన్న జరిగిన ప్రమాదంలో ప్రభావతి (36), యాదమ్మ (40), గుండమ్మ (52), జక్కమ్మ (32), రుక్మిణి (60), ఈశ్వరమ్మ (45) మృతి చెందారు. ఈరోజు, ఈశ్వరప్ప బక్కప్ప (55), పార్వతి మారుతి (42) చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో మరణించారు.

ప్రమాదంలో గాయపడిన వారిని బీదర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉడమనల్లి గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన బెమల్‌ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.