AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..!

త్రిఫల, ఖర్జూరంతో తయారుచేసే హెర్బల్ లడ్డూ కాలేయ పనితీరును మెరుగుపరచడానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఒక అద్భుతమైన సంప్రదాయ ఔషధం. త్రిఫల పొడికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలేయం, పేగులలోని విష వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, ఫైబర్, ఆవు నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి బలాన్ని ఇస్తాయి. రోజుకు ఒక లడ్డూ తినడం వల్ల త్రిదోషాలు సమతుల్యమై, రోగనిరోధక శక్తి పెరిగి శరీరం దృఢంగా మారుతుంది. మరింత వివరంగా తెలుసుకుందాం...

కాలేయాన్ని బలపరిచే త్రిఫల - ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..!
Triphala Laddu
Jyothi Gadda
|

Updated on: Aug 07, 2026 | 7:54 AM

Share

మన శరీరంలో వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేసే అత్యంత కీలకమైన అవయవం కాలేయం. కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి మన ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రత్యేక స్థానం ఉంది. త్రిఫల సాధారణంగా చేదుగా ఉంటుంది. కాబట్టి, దానిని ఖర్జూరం, ఇతర మూలికలతో కలిపి రుచికరమైన త్రిఫల ఖర్జూర లడ్డూగా ఎలా తయారుచేయాలో, దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

గింజలు తీసిన ఖర్జూరాలు – 1 కప్పు

త్రిఫల పొడి – 3 స్పూన్లు

ఇవి కూడా చదవండి

ఎండు కొబ్బరి తురుము – 1/2 కప్పు

ఆవు నెయ్యి – 3 స్పూన్లు

సొంటి పొడి – 1/4 స్పూన్

యాలకుల పొడి – 2 చిటికెట్లు

లడ్డూ తయారీ విధానం:

ఖర్జూరాలను కొద్దిగా వేడి నీటిలో 5-10 నిమిషాలు నానబెట్టి, ఆపై మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి. బాణలిలో కొబ్బరి తురుమును దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి, ఖర్జూరం పేస్ట్ వేసి చిన్న మంటపై తేమ పోయే వరకు వేయించండి. అందులో త్రిఫల పొడి, సొంటి పొడి, యాలకుల పొడి, సగం వేయించిన కొబ్బరి తురుము వేసి బాగా కలపండి. మిశ్రమం కాస్త చల్లారాక, చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుని, మిగిలిన కొబ్బరి తురుములో దొర్లిస్తే ఆరోగ్యకరమైన త్రిఫల లడ్డూలు సిద్ధమవుతాయి.

పదార్థాల ఔషధ గుణాలు, ప్రయోజనాలు:

త్రిఫల చూర్ణం ఉసిరి, కారక్కాయ, తానికాయల మిశ్రమం: ఇది వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. కాలేయం, పేగులలోని మలినాలను తొలగించి, కాలేయ పనితీరును వేగవంతం చేస్తుంది.

ఖర్జూరం, ఆవు నెయ్యి: ఖర్జూరంలోని ప్రకృతిసిద్ధమైన సక్కర, పొటాషియం, ఫైబర్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఆవు నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థను కాపాడుతూ, మూలికలలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అబ్బేలా చేస్తుంది.

సొంటి, యాలకులు: ఇవి జఠరాగ్నిని రగిల్చి ఆకలిని పెంచుతాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం ఏర్పడకుండా నిరోధిస్తాయి.

తీసుకోవాల్సిన విధానం: ఈ లడ్డూను మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత, లేదా సాయంత్రం స్నాక్ సమయాల్లో రోజుకు ఒక లడ్డూ చొప్పున తీసుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us