కంగనా భద్రత కోసం రూ.10లక్షల భారం.. కౌంటర్ ఇచ్చిన నటి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటినీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే
Kangana Y plus security: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటినీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె సెక్యూరిటీని తొలగించాలని సుప్రీంకోర్డు అడ్వొకేట్ బ్రిజేష్ కలప్ప ఓ ట్వీట్ చేశారు. ఓ మనిషికి నెల రోజుల పాటు వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంపై రూ.10 లక్షల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగనా హిమాచల్ ప్రదేశ్లో సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కంగనాకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెబుతుందా..? అని కామెంట్ పెట్టారు.
ఆ ట్వీట్కి కంగనా టీమ్ సమాధానమిచ్చింది. బ్రిజేష్ జీ మీరు, నేను ఊహించుకొని చెప్పేదాన్ని బట్టి కేంద్రం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అపాయం ఉందా..? లేదా..? అనే విషయాన్ని దర్యాప్తు చేస్తుంది. దాని ఆధారంగా సెక్యూరిటీ గ్రేడ్ని నిర్ణయిస్తారు. దేవుడి దయ ఉంటే భవిష్యత్లో భద్రతను పూర్తిగా తీసెయొచ్చు. నాకు ఇంకా ప్రమాదం ఉందని తెలిస్తే భద్రత మరింత పెంచొచ్చు అని కామెంట్ పెట్టారు.
Read More: