బీజేపీకి జనవరి 22న కొత్త బాస్.. ఏపీ, తెలంగాణాకు కూడా..!

బీజేపీకి ఇక కొత్త బాస్ రానున్నారు. ఇప్పటి వరకు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా.. ఇక పూర్తిస్థాయి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. నడ్డా బాధ్యతలు స్వీకరించే నాటికి.. పలు రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల నియామకం పూర్తి చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రెసిడెంట్ […]

బీజేపీకి జనవరి 22న కొత్త బాస్.. ఏపీ, తెలంగాణాకు కూడా..!
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 1:02 PM

బీజేపీకి ఇక కొత్త బాస్ రానున్నారు. ఇప్పటి వరకు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా.. ఇక పూర్తిస్థాయి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. నడ్డా బాధ్యతలు స్వీకరించే నాటికి.. పలు రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల నియామకం పూర్తి చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రెసిడెంట్ రేసులో.. ప్రస్తుతం ఉన్న కన్నాతో పాటు.. పురందేశ్వరీ, ఎమ్మెల్సీ మాధవ్, మాణిక్యాలరావు ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతన్నాయి. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణనే కంటిన్యూ చేస్తారంటూ కూడా వార్తలు వెలువడుతన్నాయి. మొత్తానికి మరో వారం రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇక తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్ష మార్పులు చేయనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు.. చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఢిల్లీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలియాల్సి ఉంది.