JNU ATTACK.. బాలీవుడ్ సపోర్ట్.. ముంబైలో ప్రొటెస్ట్

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. ఆ దాడికి నిరసనగా ముంబైలో బాలీవుడ్ స్టార్స్ అంతా కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తా ప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, గేయ కవితలు చదువుతూ.. ఈ ప్రదర్శన సాగింది. దేశంలో విద్యార్థులపై ఇప్పటికే […]

JNU ATTACK.. బాలీవుడ్ సపోర్ట్.. ముంబైలో ప్రొటెస్ట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2020 | 1:08 PM

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. ఆ దాడికి నిరసనగా ముంబైలో బాలీవుడ్ స్టార్స్ అంతా కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తా ప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, గేయ కవితలు చదువుతూ.. ఈ ప్రదర్శన సాగింది. దేశంలో విద్యార్థులపై ఇప్పటికే ఎన్నో దాడులు జరిగాయని, ఇక వీటికి స్వస్తి పలకాలని కోరుతున్న ప్లకార్డులు, పోస్టర్లను వీరు ప్రదర్సించారు.  విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ నిర్దేశకులని, వారికి ఉన్నతమైన ఫ్యూచర్ ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. అటు-మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం

జెఎన్ యు ఘటనను ఖండించింది. ఆ యూనివర్సిటీ విద్యార్థులకు, ఫ్యాకల్టీ సభ్యులకు మద్దతు ప్రకటించింది. 2008 లో ముంబైలో జరిగిన దాడితో ఈ నెల 6 వ తేదీన సంభవించిన ఘటనలను ప్రభుత్వం పోల్చింది. స్వయంగా సీఎం ఉధ్ధవ్ థాక్రే ఈ ఘటనపై స్పందిస్తూ.. నాటి దృశ్యాలను తాను టీవీలో చూశానని, అలాంటి  ఘటనలను తమ రాష్ట్రంలో జరగనివ్వబోమని అన్నారు. ఢిల్లీ పోలీసులను ఆయన దుయ్యబట్టారు. పరిస్థితిని వారు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ఆయన విమర్శించారు. కాగా…  బాలీవుడ్ సెలబ్రిటీలంతా.. ప్రదర్శన అనంతరం ‘ జనమనగణమన ‘ జాతీయ గీతం ఆలపించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు