Watch: తీరని గాన గంధర్వుడు SP బాలు కోరిక.. కోటి విలువైన ఇల్లు ఇచ్చినా..
అయితే గత కొన్నేళ్ల క్రితం ఎస్పీ బాలు తల్లిదండ్రులు కాలం చేయడంతో ఆ ఇంటిని కంచి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాలకు అప్పగిస్తూ 2020లో ఎస్పీ బాలు నిర్ణయం తీసుకున్నారు. కోటి రూపాయలు పైగా విలువైన ఇళ్ళు వేద పాఠశాలకు ఇచ్చేందుకు ఎస్పీ ముందుకు రాగా.. కంచి పీఠాధిపతులు సూచించిన విధంగా పది లక్షలు ఖర్చు చేసి ఆ ఇంటిని రి మోడల్ చేసి మరీ సిద్ధం చేశారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా? అందులోను నెల్లూరు జిల్లా ప్రజలకు అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే సొంత ఇంటి మనిషి లాగా.. ఎందుకంటే ఎస్పీ బాలు ది నెల్లూరు కావడమే…..చిన్నతనంలోనే సంగీతంపై ఆసక్తి కారణంగా నెల్లూరు వదిలి తమిళనాడులో సెటిల్ అయ్యారు ఎస్పీ బాలు.. నేరుగా విషయంలోకి వెళ్తే నెల్లూరు నగరంలోని తిప్పారాజు వారి వీధిలో ఎస్పీ బాలుకి సొంత ఇల్లు ఉండేది. పేరుకే ఎస్పీ బాలు చెన్నైలో సెటిల్ అయినప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం నెల్లూరు నగరంలోని తిప్పరాజు వీధిలో సొంత ఇంట్లోనే వుండేవారు.
అయితే గత కొన్నేళ్ల క్రితం ఎస్పీ బాలు తల్లిదండ్రులు కాలం చేయడంతో ఆ ఇంటిని కంచి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాలకు అప్పగిస్తూ 2020లో ఎస్పీ బాలు నిర్ణయం తీసుకున్నారు. కోటి రూపాయలు పైగా విలువైన ఇళ్ళు వేద పాఠశాలకు ఇచ్చేందుకు ఎస్పీ ముందుకు రాగా.. కంచి పీఠాధిపతులు సూచించిన విధంగా పది లక్షలు ఖర్చు చేసి ఆ ఇంటిని రి మోడల్ చేసి మరీ సిద్ధం చేశారు. అయితే కాలక్రమేణా కోవిడ్ తో ఎస్పీ బాలు కాలం చేయడంతో కంచి పీఠం నిర్వాహకులు ఆ ఇంటిని సద్వినియోగం చేయడంలో విఫలం అయిందన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

