JioPhone Next: గూగుల్ జియో స్మార్ట్ ఫోన్ తయారీ గుజరాత్ లో.. ప్రయత్నాలు చేస్తున్న గూగుల్!

JioPhone Next: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఎజిఎం) ప్రపంచంలోనే చౌకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

JioPhone Next: గూగుల్ జియో స్మార్ట్ ఫోన్ తయారీ గుజరాత్ లో.. ప్రయత్నాలు చేస్తున్న గూగుల్!
Jiophone Next
Follow us

|

Updated on: Jul 01, 2021 | 5:19 PM

JioPhone Next: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఎజిఎం) ప్రపంచంలోనే చౌకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌ను గూగుల్ సహకారంతో రిలయన్స్ తయారు చేస్తోంది.  గుజరాత్‌లో గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు  గుజరాత్ ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే కొంతకాలం క్రితం గూగుల్ అధికారులు ఈ ప్లాంటును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూడటానికి గుజరాత్ చేరుకున్నారు.

ఆ వర్గాలు చెబుతున్న ప్రకారం.. గూగుల్ అధికార్లు ఇటీవల గుజరాత్ లో పర్యటించారు. వారు ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ధోలేరా ఎస్ఐఆర్) ను సందర్శించారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ధోలేరాలో పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇప్పటికే  ఈ పనులు 80 శాతం పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం ప్రపంచంలోని అనేక సంస్థలను అక్కడ పరిశ్రమలు నెల్లకోల్పేందుకు ప్రోత్సహిస్తోంది.

కరోనా తరువాత గుజరాత్‌కు ఏ కంపెనీ రాలేదు

కరోనా ఇబ్బందులు తలెత్తిన తరువాత నుండి పెద్ద కంపెనీలు ఏవీ గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టలేదు. కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం వైబ్రంట్ గుజరాత్ పెట్టుబడి సదస్సు కూడా జరగలేదు. ఈ కారణంగా, గూగుల్‌ను రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. అయితే, స్మార్ట్‌ఫోన్ ప్లాంట్ కోసం గూగుల్ గుజరాత్‌లో ఎంత పెట్టుబడులు పెట్టగలదో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ రిలయన్స్ ఎజిఎం సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడుతూ, “మా తదుపరి దశ గూగుల్, జియోల భాగస్వామ్యంలో సరసమైన జియో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం. ఇది భారతదేశం కోసం తయారు చేస్తున్నది. ఇది మొదటిసారిగా ఇంటర్నెట్‌ను ఉపయోగించబోయే మిలియన్ల మందికి కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. గూగుల్ క్లౌడ్, జియోల మధ్య కొత్త 5 జి భాగస్వామ్యం ఒక బిలియన్ మంది భారతీయులను వేగంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది భారతదేశం డిజిటలైజేషన్ కు కూడా సహాయపడుతుంది.” అని చెప్పారు.

ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్  ఆపరేటింగ్ సిస్టమ్‌ను జియో, గూగుల్ సంయుక్తంగా తయారు చేశాయి. సామాన్యుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీని ధర చాలా సహేతుకమైనదిగా ఉంటుందని చెప్పారు. ఇది గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 10) నుండి మార్కెట్లో లభిస్తుందాని ఆయన వెల్లడించారు. దీనితో పాటు, దేశాన్ని 2 జి ఫ్రీగా, 5 జి ఎనేబుల్ చేయడమే మా లక్ష్యం అని అంబానీ చెప్పారు.

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో గూగుల్ 33,737 కోట్ల రూపాయల పెట్టుబడి

కరోనా కారణంగా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ మధ్య కూడా, రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ .1.5 లక్షల కోట్ల పెట్టుబడిని పొందింది. గత ఏడాది జూలైలో గూగుల్ కూడా రూ .33,737 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీలో 7.73% వాటాను తీసుకుంది. ఫేస్‌బుక్ రూ .45,000 కోట్ల తర్వాత రిలయన్స్‌లో రెండవ అతిపెద్ద పెట్టుబడి ఇది.

Also Read: PM Modi; ప్రజల ప్రాణాలు నిలిపిన వైద్యులే దేవుళ్లు.. మౌలిక వైద్య సదుపాయాలకు రూ.50 వేల కోట్లతో క్రెడిట్ గ్యారెంటీ పథకంః మోదీ

ఎన్నికల ముందు పంజాబ్ కాంగ్రెస్ ‘ప్రక్షాళన’..విధేయులతో సీఎం అమరేందర్ సింగ్ ‘లంచ్ డిప్లొమసీ’