AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోడా అడవుల్లో 4 రోజులుగా కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. నిజానికి భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

దోడా అడవుల్లో 4 రోజులుగా కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలు
Doda Encounter
Surya Kala
|

Updated on: Jul 18, 2024 | 9:58 AM

Share

కాశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా బలగాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు దోడాలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైనికులు చేపట్టిన గాలింపు చర్యలు గత నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తెల్లవారుజామున దోడాలోని కస్తీగఢ్‌లోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులను సైనికులు చుట్టుముట్టారు. సమాచారం ప్రకారం కస్తీగఢ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ బలగాలు కలిసి ఈ మొత్తం ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ఇద్దరు సైనికులకు గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. నిజానికి భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఇవి కూడా చదవండి

భద్రతా బలగాలు ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టారని.. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయని అధికారి తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ OGW ల నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు.

దోడాలో కొనసాగుతోన్న ఆపరేషన్ దోడా జిల్లాలో జూన్ 12 నుంచి నిరంతర ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. చటర్‌గాలా పాస్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మర్నాడు ఉదయం గందోహ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు.

జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, జూలై 9న గాధి భగవా అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ ప్రావిన్స్‌లోని ఆరు జిల్లాల్లో దాదాపు డజను మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..