AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha poll: 11 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం.. గుజరాత్‌ నుంచి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎంపిక..

Gujarat Rajya Sabha poll: 11 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బాబుభాయ్ దేశాయ్, కేస్రీదేవ్‌సింగ్ ఝలా సహా గుజరాత్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనవారిలో..

Rajya Sabha poll: 11 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం.. గుజరాత్‌ నుంచి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎంపిక..
External Affairs Minister Jaishankar
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2023 | 6:04 PM

Share

న్యూఢిల్లీ, జూలై 17: గుజరాత్‌లోని ముగ్గురు అభ్యర్థులతోపాటు 11 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బాబుభాయ్ దేశాయ్, కేస్రీదేవ్‌సింగ్ ఝలా సహా గుజరాత్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనవారిలో ఉన్నారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులలో 6 TMC అభ్యర్థులు – సుఖేందు శేఖర్ రాయ్ డోలా సోనా, సాకేత్ గోఖలే, సమీరుల్ ఇస్లాం మరియు ప్రకాష్ బారిక్, డెరెక్ ఓబ్రెయిన్ ఉన్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో గోవా నుంచి బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు.

మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ లేకుండా రాజ్యసభకు చేరుకున్నారు. బీజేపీ నుంచి 5 మంది, టీఎంసీ నుంచి 6 మంది అభ్యర్థులు ఉన్నారు. బిజెపి నుంచి జైశంకర్‌తో పాటు, కింది బీజేపీ నాయకులు పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికయ్యారు..

  • గుజరాత్‌కు చెందిన బాబుభాయ్ దేశాయ్, కేసరిదేవ్ సింగ్ ఝాలా
  • పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనంత్ మహరాజ్
  • గోవాకు చెందిన సదానంద్ షెట్ తనవాడే

2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నికైన తర్వాత గుజరాత్‌లోని రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

TMC నుంచి డెరెక్ ఓబ్రెయిన్‌తో పాటు, పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యులుగా మారనున్న ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులు..

  • సుఖేందు శేఖర్ రాయ్
  • డోలా సేన్
  • సాకేత్ గోఖలే
  • సమీరుల్ ఇస్లాం
  • ప్రకాష్ బారిక్

మరిన్ని జాతీయ వార్తల కోసం