ఐసిస్ కుట్ర.. కరోనాతో రెచ్చిపోవాలంటూ ఇండియన్ ముస్లింలకు పిలుపునిస్తూ..
ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) భారత్లో భారీ కుట్రకు ప్లాన్లు వేస్తోంది. భారత్లో ఉన్న ముస్లింలు కరోనా క్యారియర్స్ కావాలని పేర్కొంది. ఐసీస్కు సంబంధించిన "వాయిస్ ఆఫ్ హింద్"అనే ఓ ఎడిషన్లో కథనాన్ని ప్రచురించినట్లు..
ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) భారత్లో భారీ కుట్రకు ప్లాన్లు వేస్తోంది. భారత్లో ఉన్న ముస్లింలు కరోనా క్యారియర్స్ కావాలని పేర్కొంది. ఐసీస్కు సంబంధించిన “వాయిస్ ఆఫ్ హింద్”అనే ఓ ఎడిషన్లో కథనాన్ని ప్రచురించినట్లు మన దేశానికి చెందిన ఓ జాతీయ మీడియా పేర్కొంది. అల్లాను నమ్మని వారిని హతమార్చాలంటూ ఐసీస్ పేర్కొంది. ఓ పదిహేడు పేజీల కథనాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రచురించినట్లు తెలుస్తోంది. భారత్పై దాడికి పాల్పడటానికి కరోనాను ఉపయోగించుకోవాలని.. ముస్లింలంతా కరోనా క్యారియర్స్గా మారి కాఫీర్లను అంతం చేయాలంటూ పేర్కొంది. ఇక ఈ ఐసీస్ ప్రచురించిన మ్యాగజైన్ కవర్ పేజీపై ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫొటోలతోపాటు.. ఢిల్లీ అలర్ల ఫొటోలను ముద్రించారు. అంతేకాదు.. ఏ విధంగా హతమార్చాలో అన్నదానిపై ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక తబ్లీగీ జామాత్ చీఫ్ మౌలానా సాద్ను ఐసీస్ ప్రశంసించింది. జమాత్లు కరోనా సూపర్ స్ప్రైడర్లుగా మారారని జమాత్ ముస్లింలకు అభినందనలంటూ పేర్కొందన్న విషయాన్ని జాతీయ మీడియా ప్రచురించిన కథనంలో తెలిపింది.
కాగా, ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఐసీస్ ఉగ్రవాద సానుభూతిపరులు, ఉగ్రవాదులు ఉన్నట్లు యూఎన్ తెలిపిన సంగతి తెలిసిందే.