Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయమేస్తోంది..! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల తర్వాత టెహ్రాన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమను వెంటనే భారతదేశానికి తరలించాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దాడి తర్వాత విమానాశ్రయం మూసివేయబడినందున, వారికి తీవ్రమైన ఆందోళన కలుగుతోంది. భారత రాయబార కార్యాలయం విద్యార్థుల వివరాలను సేకరిస్తోంది.

భయమేస్తోంది..! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
Building In Iran
SN Pasha
|

Updated on: Jun 13, 2025 | 11:06 PM

Share

ఇరాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత.. ఇరాన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తమను వెంటనే ఇండియాకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉన్న ముఖ్యమైన సైనిక, అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. దీనితో పరిసర ప్రాంతాలలో భయాందోళనలు చెలరేగాయి. ఇరాన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు మేము భయపడుతున్నామని చెప్పారు. దయచేసి మమ్మల్ని బయటకు తీసుకెళ్లండి. టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TUMS)లో రెండవ సంవత్సరం MBBS విద్యార్థిని అయిన కాశ్మీర్‌కు చెందిన తబియా జహ్రా PTIతో మాట్లాడుతూ.. పరిస్థితి ఇప్పుడు ప్రశాంతంగా ఉందని, మేం సురక్షితంగా ఉన్నాం, కానీ మాకు భయంగా ఉంది. మధ్యాహ్నం 3:30 గంటలకు దాడి ప్రారంభమైంది, మాకు భూమి కంపించినట్లు అనిపించిందని ఆమె వెల్లడించింది.

విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థులను కలిసి ప్రశాంతంగా ఉండాలని సూచించారని, కానీ ఏ ప్రాంతాలు సురక్షితమైనవో స్పష్టం చేయలేదని జహ్రా చెప్పారు. వీలైనంత త్వరగా తరలింపు ప్రణాళికను రూపొందించి, వారిని తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించాలని విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఇంకా కచ్చితంగా తెలియదు, కానీ టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న వైద్య సంస్థలలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన మరో విద్యార్థిని అలీషా రిజ్వి మాట్లాడుతూ.. అత్యవసర అవసరాల కోసం మా స్థానిక చిరునామాలు, సంప్రదింపు వివరాలను ఇమెయిల్ చేయమని రాయబార కార్యాలయం మమ్మల్ని కోరిందని చెప్పారు. తరలింపు అవసరమైతే వారు డేటాను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు. ఈ ఇద్దరు విద్యార్థులు 2023లో టెహ్రాన్‌కు వెళ్లిన ఐదున్నర సంవత్సరాల MBBS కోర్సులో రెండవ సంవత్సరం చదువుతున్నారు. దాడుల తర్వాత టెహ్రాన్ మీదుగా గగనతలం మూసివేశారు. ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు నిలిపివేసినట్లు ఆమె పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..