Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6G in India: 6జీ ఆవిష్కరణలో భారత్ యావత్ ప్రపంచానికి ఆదర్శం కావాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష..

ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అగ్రగామిగా ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కోరిక అని టెలికమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

6G in India: 6జీ ఆవిష్కరణలో భారత్ యావత్ ప్రపంచానికి ఆదర్శం కావాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష..
Union Telecom Minister Ashw
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 03, 2022 | 1:05 PM

దేశంలో శనివారం 5జీ సేవల్లో విప్లవం చోటు చేసుకుంది. దేశంలో 5జీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఈ సంద్భంగా కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణబ్ సిక్స్-జి సేవల్లో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్‌కు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికత మేరకు సిక్స్-జీ సేవల్లో భారత్ ముందుంటుందని అశ్విని వైష్ణబ్ అన్నారు. 6G  వైర్‌లెస్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కోరిక అని మంత్రి అన్నారు.

ముఖ్యంగా, 5G సేవలను ప్రారంభించటానికి కొన్ని వారాల ముందు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ దశాబ్దం చివరి నాటికి 6G సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన మంత్రి ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022 గ్రాండ్ ఫినాలేలో ప్రసంగించారు. 

ఆ సమయంలో నరేంద్ర మోడీ సిక్స్-జి గురించి ఈ వ్యాఖ్య చేశారు. యాదృచ్ఛికంగా.. శనివారం ప్రారంభించిన 5G నెట్‌వర్క్ సేవ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడమే కాకుండా.. విపత్తు నిర్వహణ, వ్యవసాయం సహా అనేక ఇతర రంగాలలో ప్రభుత్వానికి సహాయం చేస్తుందన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇప్పటికే జియో “ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అత్యధిక నాణ్యత, సరసమైన ధరలో” 5జీ సేవలను అందించనున్నట్లు ప్రకటించారు. జియో టెలికాం ఆపరేటర్ డిసెంబర్ 2023 నాటికి భారతదేశంలోని ప్రతి మూలకు 5G కవరేజీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఎయిర్‌టెల్ కూడా ఈరోజు నుంచి భారతదేశంలోని ఎనిమిది నగరాల్లో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 

అన్ని నగరాల పేర్లు తెలియనప్పటికీ, ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరులకు ఈ రోజు 5G సేవలు లభిస్తాయని కంపెనీ ధృవీకరించింది. వొడాఫోన్-ఐడియా త్వరలో 5G సేవలను కూడా ప్రారంభించనున్నాయి.

దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి చేతుల మీదుగా పండుగ సీజన్‌లో 5G సేవ ప్రారంభమైంది. ఇది దేశప్రజలకు భారత ప్రభుత్వం ఇచ్చిన పెద్ద బహుమతి. కనీసం టెలికాం రంగానికి సంబంధించిన వర్గాలు కూడా ఇదే అనుకుంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ జంట డాన్స్ వీడియో నిజమేనా..?
నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ జంట డాన్స్ వీడియో నిజమేనా..?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
వాట్సాప్‌లో ఈ మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ గురించి మీకు తెలుసా..?
వాట్సాప్‌లో ఈ మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ గురించి మీకు తెలుసా..?
అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా.. ఇలా చేస్తే అంతకుమించి ఫలితం
అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా.. ఇలా చేస్తే అంతకుమించి ఫలితం
Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌...
Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌...
బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు
బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు
ఎయిర్‌టెల్‌లో ప్రభుత్వానికి వాటా ఉంటుందా? ఆ కంపెనీ డిమాండ్‌ ఏంటి?
ఎయిర్‌టెల్‌లో ప్రభుత్వానికి వాటా ఉంటుందా? ఆ కంపెనీ డిమాండ్‌ ఏంటి?
ఇది నిజంగా అందమైన ఫ్రీవెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. నెటిజన్లు ఫిదా..!
ఇది నిజంగా అందమైన ఫ్రీవెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. నెటిజన్లు ఫిదా..!
స్కూల్‌ విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు..తర్వాత ఏం జరిగిందంటే!
స్కూల్‌ విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు..తర్వాత ఏం జరిగిందంటే!
కాళ్లు చెప్పే గుండె జబ్బు సంకేతాలివి.. వీటిని నిర్లక్ష్యం చేయకండి
కాళ్లు చెప్పే గుండె జబ్బు సంకేతాలివి.. వీటిని నిర్లక్ష్యం చేయకండి