AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?

Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు

India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus India
Shaik Madar Saheb
|

Updated on: Jul 14, 2021 | 10:32 AM

Share

Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. కాగా సోమవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసులు మరలా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో (మంగళవారం) 38,792 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా.. 624 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074 కి చేరగా.. మరణాల సంఖ్య 4,11,408 కి పెరిగింది.

కాగా నిన్న కరోనా నుంచి 41,000 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారిసంఖ్య మొత్తం 3,01,04,720కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,29,946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 19,15,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకూ 43,59,73,639 నిర్ధరాణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 37,14,441 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ డోసులతో కలిపి ఇప్పటివరకూ 38,76,97,935 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Also Read:

తాలిబన్లతో చర్చలు విఫలమైతే మేం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చు..ఆఫ్ఘనిస్తాన్ రాయబారి

Markets Closed: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే.. మరో రెండు మార్కెట్ల మూసివేసిన కేజ్రీవాల్ సర్కార్