AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: దేశంలో పెరిగిన కరోనా రికవరీలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

దేశంలో 19,067 (0.04 శాతం) కరోనావైరస్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.74 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

India Covid-19: దేశంలో పెరిగిన కరోనా రికవరీలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
India Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2022 | 10:41 AM

Share

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గాయి. అనంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో (బుధవారం) కరోనా కేసుల సంఖ్య మూడు వేలకు దిగువన నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 2,827 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 24 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 19,067 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.74 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,13,413 కి చేరింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,24,181 కి పెరిగింది.
  • నిన్న కరోనా నుంచి 3,230 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,70,165 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 190,83,96,788 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 14,85,292 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • బుధవారం దేశవ్యాప్తంగా 4,71,276 మందికి కరోనా పరీక్షలు చేశారు.
  • ఇప్పటివరకు 84.24 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Cyclone Asani Live Updates: ఏపీలో ఇంకా తగ్గని అసని ప్రభావం.. ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్..

Viral Video: విమానం ఎక్కనివ్వలేదని.. నేలపై పడి బోరున విలపించిన మహిళ