AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేసిన భారత్‌! దాడి వీడియో రిలీజ్‌ చేసిన ఇండియన్‌ ఆర్మీ

పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులకు ప్రయత్నించిన నేపథ్యంలో భారత సైన్యం తీవ్ర ప్రతీకార దాడి చేసింది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సమర్థవంతంగా నాశనం చేసింది. 26కి పైగా డ్రోన్ దాడుల ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకుంది.

Video: ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేసిన భారత్‌! దాడి వీడియో రిలీజ్‌ చేసిన ఇండియన్‌ ఆర్మీ
Terrorist Launchpads
SN Pasha
|

Updated on: May 10, 2025 | 1:23 PM

Share

జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లోని అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించినందుకు ప్రతిస్పందనగా భారత సైన్యం ప్రతిదాడి చేసింది. ఈ దాడిలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై సమన్వయంతో కాల్పులు జరిపి, వాటిని సమర్థవంతంగా నాశనం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా భారత సైన్యం శనివారం తెలిపింది. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ సమీపంలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు చాలా కాలంగా భారత పౌరులు, భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికలు రూపొందించడానికి కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.

26 చోట్ల డ్రోన్ దాడులను తిప్పికొట్టింది..

మే 9, 10 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఉన్న ప్రాంతాలలో విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు వంటి కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 26కి పైగా ప్రదేశాలపై డాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. శ్రీనగర్, అవంతిపూర్, ఉధంపూర్ వైమానిక స్థావరాలలోని ఆసుపత్రులు, పాఠశాల ప్రాంగణాలను కూడా పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని అన్నారు.

దాడుల తీవ్రత ఉన్నప్పటికీ భారత దళాలు విజయవంతంగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నాయి. అయితే ఉధంపూర్, పఠాన్‌కోట్, ఆదంపూర్, భుజ్, భటిండాలోని వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ తెల్లవారుజామున 1:40 గంటలకు హై-స్పీడ్ క్షిపణులను ఉపయోగించడాన్ని, శ్రీనగర్, అవంతిపూర్‌, ఉధంపూర్‌లోని వైమానిక స్థావరాలలోని ఆసుపత్రులు, పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడాన్ని అధికారులు తీవ్రంగా ఖండించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..