AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Defence budget: ప్రైవేట్ కంపెనీల నుండి ఆయుధాల కొనుగోలు.. కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం..

రక్షణ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రక్షణ శాఖ బడ్జెట్‌లో మూలధన వ్యయం 25 శాతం స్వదేశీ ప్రైవేట్ పరిశ్రమల కోసం రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Indian Defence budget: ప్రైవేట్ కంపెనీల నుండి ఆయుధాల కొనుగోలు.. కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం..
Defence
Balaraju Goud
|

Updated on: Apr 09, 2022 | 12:25 PM

Share

Indian Defence Budget: రక్షణ శాఖ(Indian Defence Department)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రక్షణ శాఖ బడ్జెట్‌లో మూలధన వ్యయం 25 శాతం స్వదేశీ ప్రైవేట్ పరిశ్రమల(Indigenous private industry) కోసం రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ఈ ఏడాది బడ్జెట్‌లో 21,149 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేవలం స్వదేశీ ప్రయివేటు కంపెనీలు తయారు చేసే ఆయుధాలు, ఇతర పరికరాలకే ఖర్చు చేయనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, స్వదేశీ కంపెనీలకు కేటాయించిన బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు స్వదేశీ స్టార్టప్‌ల నుండి ఆయుధాలు లేదా సాంకేతికతను కొనుగోలు చేయడానికి కేటాంపులు చేసింది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డి)లో ప్రైవేట్ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, డిఫెన్స్ బడ్జెట్‌లో మొదటిసారిగా ఆర్ అండ్ డిలో 25 శాతం స్టార్టప్‌లు, స్వదేశీ పరిశ్రమలు, విద్యా సంస్థలకు కేటాయించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. 2021-22తో పోలిస్తే ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌లో దాదాపు 10 శాతం పెరిగింది.

ఈ సంవత్సరం అంటే 2022 – 23లో రక్షణ బడ్జెట్ మొత్తం 5.25 లక్షల (5,25,166.15) కోట్లు. గతేడాది అంటే 2021 22లో మొత్తం రక్షణ బడ్జెట్ 4.78 లక్షల కోట్లు. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌లో కొత్త ఆయుధాలు, సైనిక పరికరాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇతర ఆధునికీకరణ కోసం మొత్తం 1.52 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయించింది. ఈ మూలధన వ్యయం గతేడాది కంటే దాదాపు 12 శాతం ఎక్కువ. గతేడాది మూలధన వ్యయం 1.35 లక్షల కోట్లు.

విశేషమేమిటంటే ఈ ఏడాది రక్షణ రాజధాని బడ్జెట్‌లో 68 శాతం స్వదేశీ ఆయుధాలకే కేటాయించారు. పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. గత ఏడాది ఇది 58 శాతంగా ఉందని, అయితే, గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2021 22లో ఇది 63 శాతం, 2020-21లో 58 శాతం అని చెప్పారు.

స్వదేశీ ఆయుధాల కొనుగోళ్లకు 68 శాతం కేటాయించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ, ‘ఇది వోకల్ ఫర్ లోకల్ పుష్‌కు అనుగుణంగా ఉంది. ఇది ఖచ్చితంగా దేశీయ రక్షణ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని అన్నారు. ఈ ఏడాది మూలధన వ్యయంలో ఆర్మీ వాటా 32,015 కోట్లు, నేవీ 47,590 కోట్లు, వైమానిక దళం 55,586 కోట్లు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కోసం 11,981 కోట్లు కేటాయించారు. మొత్తం R&D వ్యయంలో 25 శాతం స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల కోసం కేటాయించడం జరిగింది. ఇది అద్భుతమైన చర్యగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2022 23లో రక్షణ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ వ్యయం కోసం 2.33 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది రెవెన్యూ వ్యయం దాదాపు 2.27 లక్షల కోట్లు. ఈ ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖలోని పౌర విభాగానికి 21,100 కోట్లు కేటాయించారు. రక్షణ బడ్జెట్‌లో రక్షణ పెన్షన్ కోసం దాదాపు 1.20 లక్షల కోట్లు కేటాయించారు.

Read Also… Payyavula on CM: ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ భాష మాట్లాడితే మంచిది.. వైఎస్ జగన్‌కు టీడీపీ నేత పయ్యావుల హితవు!

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..