AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆసుపత్రిలో డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆసుపత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంచో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ వెళ్లారు. ఆ ఆసుపత్రిలోని అన్ని పరిసరాలను పరిశీలించారు. అలా పరిశీలిస్తుండగా.. ఆసుపత్రిలో టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో ఎంపీ హేమంత్ ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు.

Watch Video: ఆసుపత్రిలో డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ.. వీడియో వైరల్
Toilet Cleaning
Aravind B
|

Updated on: Oct 03, 2023 | 9:30 PM

Share

మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆసుపత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంచో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ వెళ్లారు. ఆ ఆసుపత్రిలోని అన్ని పరిసరాలను పరిశీలించారు. అలా పరిశీలిస్తుండగా.. ఆసుపత్రిలో టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో ఎంపీ హేమంత్ ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు. ఇలా ఏకంగా డీన్‌తోనే శుభ్రం చేయించడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని శంకర్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. సోమవారం నాటికి 24గా ఉన్న మృతుల సంఖ్య కేవలం మరో 24 గంటల వ్యవధిలోనే 31కి చేరింది.

అయితే వీరిలో చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీనివల్ల మరో 71 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు తమ స్పందనను తెలియజేశాయి. ఇదిలా ఉండగా.. ఆసుపత్రి డీన్ వకోడా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కొరవడటం అలాగే ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం చేయడం వల్లే మరణాలు జరిగాయనే విమర్శల రావడాన్ని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు రోగులకు సరైన వైద్యమే అందిస్తున్నామని కానీ వాళ్లే వైద్యానికి స్పందించలేదని ఆయన అన్నారు. అలాగే మరోవైపు ప్రతిపక్షాలు సైతం అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో షిండే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఇవి కూడా చదవండి

దీంతో వెంటనే షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ వెంటనే శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. అయితే అక్కడి టాయ్‌లెట్‌ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించారు. దీంతో వెంటనే ఆసుపత్రి డీన్‌ను పిలిపించారు. ఆ తర్వాత ఆయనతోనే ఆ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయించారు. అలాగే ఎంపీ కూడా అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు ఆసుపత్రిలో మరణాలపై విచారణ చేసేందుకు కమిటీని నియమించినట్లు వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసెఖర్ స్పష్టం చేశారు.

Follow Us
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే