Independence Day 2022: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. ఎటుచూసినా మువ్వన్నెల రెపరెపలే..

Independence Day 2022: దేశ‌వ్యాప్తంగా స్వాంతంత్య్ర వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించ‌డానికి ముమ్మర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Independence Day 2022: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. ఎటుచూసినా మువ్వన్నెల రెపరెపలే..
Red Fort
Follow us

|

Updated on: Aug 14, 2022 | 9:45 AM

Independence Day 2022: దేశ‌వ్యాప్తంగా స్వాంతంత్య్ర వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించ‌డానికి ముమ్మర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దేశ‌ రాజ‌ధాని ఢిల్లీలో వేడుకల కోసం ఎర్రకోట మువ్వన్నెలతో ముస్తాబైంది. ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్ పూర్తయింది. ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకలకు ఏడు వేల మంది ఆహ్వానితులు హాజరు కానున్నారు. భద్రత కోసం సుమారు పది వేల మంది పోలీసులను మోహ‌రించ‌నున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతో ఎర్రకోట ప్రవేశ ద్వారం దగ్గర మల్టీ లేయర్‌ సెక్యూరిటీ కవర్‌ ఏర్పాటు చేశారు. భ‌ద్రతా చ‌ర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలను వాడుతున్నారు.

అలాగే, ఎర్రకోట చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వరకు నో కైట్ ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను కూడా ఇన్‌స్టాల్ చేశారు. త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌సీసీ కేడెట్స్‌ ఫుల్‌డ్రెస్‌ రిహార్సల్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎర్రకోటపై ఎగురుతున్న జాతీయ పతాకంపై మిలిటరీ హెలికాప్టర్‌ పూలజల్లు కురిపించింది. వీవీఐపీల ఎస్కార్ట్‌కు సంబంధించి ఎస్పీజీ కమాండోలు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఓవరాల్‌గా రేపు జరగనున్న ఆజాదీ కా అమృతోత్సవ్‌ వేడుకలకు అంతా సిద్ధమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..