AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపో, మాపో కల్లోల కాశ్మీర్‌లో అమిత్ షా పర్యటన

గత మూడు రోజులుగా కల్లోలంగా ఉన్నా కశ్మీర్‌లోయను త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన అనంతరం.. కశ్మీర్‌ను సందర్శించనున్నారు. అమర్‌నాథ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు.. అక్కడే ఉండి పరిస్థితుల హోం మంత్రి అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులు వెనక్కి తిరిగి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు […]

రేపో, మాపో కల్లోల కాశ్మీర్‌లో అమిత్ షా పర్యటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2019 | 10:40 AM

Share

గత మూడు రోజులుగా కల్లోలంగా ఉన్నా కశ్మీర్‌లోయను త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన అనంతరం.. కశ్మీర్‌ను సందర్శించనున్నారు. అమర్‌నాథ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు.. అక్కడే ఉండి పరిస్థితుల హోం మంత్రి అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులు వెనక్కి తిరిగి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. యాత్రికులు, పర్యాటకుల రక్షణ తమ బాధ్యతని, చొరబాటు కోసం సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచి ఉండటం, అందులో ఆత్మాహుతి బాంబర్లే ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా యాత్రను రద్దు చేసినట్టు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివరణ ఇచ్చారు.