AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: లఖీంపూర్ టు లక్నో.. రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో యూపీలో హైటెన్షన్

లక్నో టు లఖీంపూర్‌.. టోటల్‌గా యూపీలో హైటెన్షన్‌. కేంద్రమంత్రి కొడుకు రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో ఉత్తరప్రదేశ్‌

UP: లఖీంపూర్ టు లక్నో.. రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో యూపీలో హైటెన్షన్
Lucknow
Venkata Narayana
|

Updated on: Oct 04, 2021 | 11:19 AM

Share

Uttar Pradesh Lakhimpur Kheri violences: లక్నో టు లఖీంపూర్‌.. టోటల్‌గా యూపీలో హైటెన్షన్‌. కేంద్రమంత్రి కొడుకు రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడికిపోతోంది. తాజాగా.. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఇంటిదగ్గర కారును దగ్దం చేశారు ఆందోళన కారులు.

యూపీ లఖీంపూర్‌ ఖేరీలో హై టెన్షన్‌ నెలకొంది. నిన్న రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఖీంపూర్‌ఖేరీకి వెళ్లనున్నారు విపక్ష సభ్యులు. దీంతో లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్‌ విధించారు. లఖీంపూర్‌ ఘటన నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీ బోర్డర్లను పూర్తిగా మూసివేశారు.

ప్రియాంకగాధీ, అఖిలేష్‌ యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం సహా పలువురు నేతలు లఖింపూర్‌ఖేరీకి వెళ్లి రైతులను పరామర్శించనున్నారు. ఐతే నేతలెవరూ రాకుండా నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. బారికేడ్లు, వాహనాలను అడ్డంగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుంగా ప్రియాంకగాంధీని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు అఖిలేష్‌ యాదవ్‌ను అడ్డుకోవడంతో ఆయన ధర్నాకు దిగారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. కేంద్రమంత్రి కాన్వాయ్‌ రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆగ్రహంతో పలు వాహనాలకు నిప్పు పెట్టారు అన్నదాతలు. ఐతే కాన్వాయ్‌లో తన కుమారుడు లేడంటున్నారు మిశ్రా. రైతుల దాడిలో కాన్వాయ్‌ బోల్తా పడిందని అంటున్నారు.

Read also: National News: దేశవ్యాప్తంగా అనూహ్య ఘటనలు.. జాతీయవార్తల సమాహారం. నేటి నేషనల్ రౌండప్. టూకీగా..