AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అటల్‌జీ జయంతి రోజున బీజేపీ నిధుల ప్రచారం.. తొలి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యులు, ఇతరుల నుండి విరాళాలు సేకరించే లక్ష్యంతో నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది.

PM Modi: అటల్‌జీ జయంతి రోజున బీజేపీ నిధుల ప్రచారం.. తొలి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ
Pm Modi
Balaraju Goud
|

Updated on: Dec 25, 2021 | 7:03 PM

Share

PM Modi Donates Party Fund: వచ్చే ఏడాది దేశంలోని 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల పోరులో తమ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు బీజేపీ నిరంతరం అనేక దూకుడు ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యులు, ఇతరుల నుండి విరాళాలు సేకరించే లక్ష్యంతో నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు పార్టీల నేతలు ప్రచారం కింద విరాళాలు అందించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

బీజేపీకి విరాళాలు అందిస్తామంటూ ప్రధాని మోడీ తొలుత ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయి 97వ జయంతి సందర్భాన్ని ఎంచుకున్నారు. శనివారం మధ్యాహ్నం చేసిన ట్వీట్‌లో, భారతీయ జనతా పార్టీ పార్టీ నిధికి తాను రూ. 1,000 విరాళంగా ఇచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశాన్ని ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంచాలనే మా ఆదర్శం, జీవితాంతం నిస్వార్థంగా మా కేడర్‌కు సేవ చేసే సంస్కృతి మీ చిన్న విరాళం ద్వారా మరింత బలపడుతుందని మోడీ అన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు సహకరించండి. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి సహాయం చేయండి. అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి మండలిలోని పలువురు సభ్యులు కూడా బీజేపీకి విరాళాలు ఇచ్చారు. వీరిలో అమిత్ షా, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ,పీయూష్ గోయల్, పెమా ఖండూ, కిరణ్ ఖేర్, రమణ్ సింగ్‌లు బీజేపీకి విరాళాలు అందించిన వారిలో ఉన్నారు. వీటితో పాటు, ఐటీసీ, కళ్యాణ్ జ్యువెలర్స్, రేర్ ఎంటర్‌ప్రైజెస్, అంబుజా సిమెంట్, లోధా డెవలపర్స్ మరియు మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ పరిశ్రమలు బీజేపీకి విరాళాలు అందించాయి. న్యూ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, జలకల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్ట్, ట్రయంఫ్ ఎలక్టోరల్ కూడా బీజేపీ ఫండ్‌కి విరాళాలు అందించాయి.

కాగా, ఇతర పార్టీ నేతలు కూడా బీజేపీకి తమ వంతు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2019-20లో బీజేపీ రూ.785 కోట్ల విరాళాలు అందుకోగా, వరుసగా 7వ ఏడాది విరాళాల విషయంలో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. 2019-20లో అత్యధికంగా రూ.785 కోట్ల విరాళాన్ని అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌కు రూ.139 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ విధంగా కాంగ్రెస్ కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్‌కు బిజెపి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం మరియు జూన్ 2021లో ఎన్నికల సంఘం బహిరంగపరచిన నివేదిక ప్రకారం, పార్టీకి రూ.785 కోట్ల విరాళాలు అందాయి. సమాచారం ప్రకారం, ఎలక్టోరల్ ట్రస్ట్, పరిశ్రమలు, పార్టీ స్వంత నాయకులు బిజెపికి అత్యధికంగా విరాళాలు అందించారు.

ఈ ప్రచారం డిసెంబర్ 25 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆ రోజు పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి. ప్రజల సహకారంతో వచ్చిన ఈ నిధులను పార్టీ నిర్వహణకు వినియోగిస్తామని పార్టీ అధ్యక్షుడు తెలిపారు.

Read Also… AP CM meets CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం వైఎస్ జగన్‌ భేటీ.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు