‘ఇదేంది అయ్యోరూ..’ తప్పతాగి వచ్చి తరగతి గదిలోకి వెళ్లలేక నేలపై దొర్లుతోన్న హెచ్‌ఎం

ఆయన బాధ్యత కలిగిన ఓ ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మార్గదర్శి. విధి నిర్వహణలో బాధ్యత మరిచి ఫూటు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో తరగతి గదిలోకి కూడా వెళ్లలేక గది ముందే నేలపై పడి దొర్లుతున్న దృశ్యం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒడిస్సాలోని కేంఝర్‌ జిల్లా హరిచందన్‌పూర్‌ సమితిలో ఉన్న గరదాహాబహాలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం (సెప్టెంబర్ 27) ఇందుకు..

'ఇదేంది అయ్యోరూ..' తప్పతాగి వచ్చి తరగతి గదిలోకి వెళ్లలేక నేలపై దొర్లుతోన్న హెచ్‌ఎం
Drunken Headmaster Lying At School
Follow us

|

Updated on: Sep 29, 2023 | 9:42 AM

భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 29: ఆయన బాధ్యత కలిగిన ఓ ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మార్గదర్శి. విధి నిర్వహణలో బాధ్యత మరిచి ఫూటు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో తరగతి గదిలోకి కూడా వెళ్లలేక గది ముందే నేలపై పడి దొర్లుతున్న దృశ్యం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒడిస్సాలోని కేంఝర్‌ జిల్లా హరిచందన్‌పూర్‌ సమితిలో ఉన్న గరదాహాబహాలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం (సెప్టెంబర్ 27) ఇందుకు సంబంధించిన దృశ్యం కనిపించింది. వివరాల్లోకెళ్తే..

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని కియోంజర్‌లోని హరిచందన్‌పూర్ బ్లాక్ పరిధిలోని గరగడబహల్ ప్రాథమిక పాఠశాలలో బసంత్ కుమార్ ముండ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వసంత ముండతోపాటు మరో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న బసంత్ కుమార్ బుధవారం (సెప్టెంబర్ 27) తప్ప తాగి పాఠశాలకు వచ్చాడు. బుధవారం ఉదయం మత్తులో తూలుతూ వచ్చిన బసంత్‌ కుమార్ కనీసం తరగతి గదిలోకి కూడా వెళ్లలేక పాఠశాల ఆవరణలోనే మద్యం మత్తులో కింద పడి దొర్లుతూ కనిపించాడు.

కనీసం తరగతి గదిలోకి కూడా వెళ్లలేక నేలపైనే..

పాఠశాల ఆవరణలోని చెట్టు దగ్గర పడి ఉన్న ప్రధానోపాధ్యాయుడిని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే గ్రామస్థులు అనేక మంది పాఠశాల వద్దకు చేరుకుని సోయలేకుండా పడిఉన్న ప్రధానోపాధ్యాయుడిని చూసి ముక్కున వేలేసుకున్నారు. అనంతరం ఆయనకు సపర్యలు చేశారు. అక్కడ ఉన్న కొందరు యవకులు ఈ దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా కియోంజర్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయమై గ్రామస్థులు కొందరు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తు చేసి సదరు ప్రధానోపాధ్యాయునిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..
ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌ ఫోగాట్.. భారత్‌కు మరో పతకం ఖాయం
ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌ ఫోగాట్.. భారత్‌కు మరో పతకం ఖాయం
ప్రభాస్‌తో త్రిష..16 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా.. ఏసినిమాలోనంటే?
ప్రభాస్‌తో త్రిష..16 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా.. ఏసినిమాలోనంటే?
అందుకోసం ప్రత్యేకంగా మరాఠీ నేర్చుకుంటోన్న రష్మిక మందన్నా..
అందుకోసం ప్రత్యేకంగా మరాఠీ నేర్చుకుంటోన్న రష్మిక మందన్నా..
ఆన్‌లైన్ షాపింగ్‌లో కొత్త స్కామ్..జాగ్రత్తగా ఉండకపోతే జేబు గుల్లే
ఆన్‌లైన్ షాపింగ్‌లో కొత్త స్కామ్..జాగ్రత్తగా ఉండకపోతే జేబు గుల్లే
ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే
ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే
ఏపీ పాలిటిక్స్‌లో కనిపించని రోజా.. సైలెన్స్‌కు కారణమదేనా?
ఏపీ పాలిటిక్స్‌లో కనిపించని రోజా.. సైలెన్స్‌కు కారణమదేనా?
జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ నేచురల్ డ్రింక్స్‌తోఒక్కవారంలో
జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ నేచురల్ డ్రింక్స్‌తోఒక్కవారంలో
తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్
తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్
నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట
నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట