లక్నో బయలుదేరిన హత్రాస్ కుటుంబం
అలహాబాద్ హైకోర్టు ఎదుట హాజరయ్యేందుకు హత్రాస్ కుటుంబం సోమవారం ఉదయం లక్నో బయలుదేరింది. వీరివెంట పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. హత్రాస్ జిల్లా నుంచి లక్నో సుమారు 380 కి.మీ. దూరంలో ఉంది.
అలహాబాద్ హైకోర్టు ఎదుట హాజరయ్యేందుకు హత్రాస్ కుటుంబం సోమవారం ఉదయం లక్నో బయలుదేరింది. వీరివెంట పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. హత్రాస్ జిల్లా నుంచి లక్నో సుమారు 380 కి.మీ. దూరంలో ఉంది. అంటే వీరు ఆ నగరానికి మధ్యాహ్నం వరకు చేరుకోవచ్ఛు. తమతో జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ కూడా వస్తున్నారని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అంజలి గన్వర్ తెలిపారు. న్యాయమూర్తులు రంజన్ రాయ్, జస్ ప్రీత్ సింగ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారిస్తోంది. హత్రాస్ ఫ్యామిలీ లక్నో వెళ్తున్న సందర్భంగా శాంతి సభలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. హత్రాస్ లో ఎలాంటి వదంతులనూ నమ్మరాదని విజ్ఞప్తి చేశారు.